బెంగళూరులో విద్యార్థినిలకు మర్మారంగం చూపించాడు: అమ్మాయిలు చుట్టుముట్టి !
బెంగళూరు నగరంలో ప్రసిద్ది చెందిన మౌంట్ కార్మల్ స్కూల్ ముందు నిలబడి విద్యార్థినిలకు మర్మాంగం చూపించి వారిని లైంగికంగా వేధింపులకు గురి చేసిన వ్యక్తిని విద్యార్థులు .
బెంగళూరు: బెంగళూరు నగరంలో ప్రసిద్ది చెందిన మౌంట్ కార్మల్ స్కూల్ ముందు నిలబడి విద్యార్థినిలకు మర్మాంగం చూపించి వారిని లైంగికంగా వేధింపులకు గురి చేసిన వ్యక్తిని విద్యార్థులు చుట్టుముట్టి దేహశుద్ది చేసి పోలీసులకు అప్పగించారు.
ప్రతిరోజు స్కూల్ ప్రారంభం అయిన సమయంలో, స్కూల్ వదిలి పెట్టిన సమయంలో ప్యాంట్ లో నుంచి మర్మాంగం బయటకు తీసి విద్యార్థులకు చూపించి లైంగిక వేదింపులకు గురి చేసిన విజేష్ అనే వ్యక్తిని బుధవారం అమ్మాయిలు అందరూ కలిసి చితకబాదేశారు.
విజేష్ తాను రిపోర్టర్ అనే చెప్పుకుని తిరుగుతున్నాడు. మౌంట్ కార్మల్ స్కూల్ లో విద్యాభ్యాసం చేస్తున్న అమ్మాయిలు స్కూటర్ లో వస్తే స్కూల్ సమీపంలోని లూఫ్ రోడ్డులో వారి వాహనాలు పార్క్ చేస్తుంటారు. లూఫ్ రోడ్డులోని స్కూటర్ పార్కింగ్ స్థలంలో ప్రతిరోజూ విజేష్ నిలబడి ఉంటాడు.
స్కూల్ కు వచ్చే అమ్మాయిలను చూసిన వెంటనే ఫ్యాంట్ లో నుంచి మర్మాంగం బయటకు తియ్యడం, వారికి చూపించి లైంగిక వేధింపులకు గురి చేసి పక్కకు పిలవడం చేస్తున్నాడు. ప్రతి రోజు విజేష్ చేష్టలతో స్కూల్ విద్యార్థినిలు విసిగిపోయారు.
బుధవారం అమ్మాయి అందరూ ముందుగానే మాట్లాడుకుని స్కూటర్ పార్కింగ్ దగ్గరకు వెళ్లారు. ఆ సమయంలో ఎప్పటిలాగే విజేష్ మర్మాంగం చూపించి లైంగికంగా వేధించాడు. అంతే అమ్మాయిలు అందరూ విజేష్ ను చుట్టుముట్టి చితకబాదేశారు. అతన్ని అక్కడే కట్టేసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు విజేష్ ను అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు.