బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్..
దేశంలోని మెట్రో పాలిటన్ నగరాల్లో బెంగళూరు ఒకటి. ఐటీ కంపెనీలు అధికంగా ఉండటం కారణంగా ఈ నగరం నిత్యం రద్దీగా ఉంటుంది. ఈ నేపథ్యంలో బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్. బెంగళూరులోని నమ్మ మెట్రో 'ఎల్లో లైన్' ప్రారంభానికి సిద్ధమైంది. ఈ లైను రాష్ట్రీయ విద్యాలయ రోడ్ (RV రోడ్) నుంచి బొమ్మసండ్ర ప్రాంతాలను కలుపుతుంది. ఎల్లో లైన్ మొత్తం పొడవు దాదాపుగా 18.82 కిలోమీటర్లు ఉంటుంది. ఈ లైన్ ఫైనల్ సేఫ్టీ పరీక్షలు త్వరలో చేయనున్నారు. అనంతరం ఈ మెట్రో లైను అందుబాటులోకి రానుంది.
బెంగళూరు ప్రజలకు గుడ్ న్యూస్. బెంగళూరులోని నమ్మ మెట్రో 'ఎల్లో లైన్' త్వరలో ప్రారంభం కాబోతోంది. ఈ మెట్రో లైను ఈ లైను రాష్ట్రీయ విద్యాలయ రోడ్ (RV రోడ్) నుంచి బొమ్మసండ్ర ప్రాంతాలను కలుపుతుంది. ఎల్లో లైన్ మొత్తం పొడవు దాదాపుగా 18.82 కిలోమీటర్లు ఉంటుంది. ఈ మేరకు అధికారులు ఫైనల్ టెస్టింగ్ నిర్వహించనున్నారు. జూలై 22 నుంచి జూలై 25 వరకు కమిషనర్ ఆఫ్ మెట్రో రైల్వే సేఫ్టీ (CMRS) ఈ భద్రతా తనిఖీని నిర్వహిస్తారు. అనంతరం ఈ ఎల్లో లైన్ అందుబాటులోకి రానుంది.
బెంగళూరు మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ సంస్థ వచ్చే నెల ఆగస్టులో ఈ లైను ప్రారంభించనున్నట్లు పేర్కొంది. తొలుత ఈ లైన్ లో మూడు రైళ్లు నడుస్తాయని.. అనంతరం రద్దీ దృష్ట్యా రైళ్లు పెరుగుతాయని తెలిపింది. బెంగళూరులో కనెక్టివిటీ మరింత పెంచడం, ట్రాఫిక్ రద్దీని తగ్గించడం, గ్రీన్-పింక్ లైన్స్ డైరెక్ట్ ఇంటర్ చేంజ్ను అందించడం ఎల్లో లైన్ ముఖ్య ఉద్దేశమని మెట్రో సంస్థ పేర్కొంది. నగరంలోని ఇన్ఫోసిస్, బయోకాన్ వంటి ఐటీ సంస్థలకు నిలయంగా ఉన్న ఎలక్ట్రానిక్ సిటీ మీదుగా ఎల్లో లైన్ వెళుతుందని తెలిపింది.

ఎల్లో లైన్ స్టేషన్లు ఇవే..
RV రోడ్: ఇది గ్రీన్ లైన్తో ఇంటర్చేంజ్
రాగిగుడ్డ
జయదేవ హాస్పిటల్: ఇది పింక్ లైన్తో భవిష్యత్తులో ఇంటర్చేంజ్ అవుతుంది
BTM లేఅవుట్
సెంట్రల్ సిల్క్ బోర్డ్
బొమ్మనహళ్లి
హొంగసంద్ర
కుడ్లు గేట్
సింగసంద్ర
హోసా రోడ్
బెరటేన అగ్రహార
ఎలక్ట్రానిక్ సిటీ
కోనప్పన అగ్రహార
హుస్కూర్ రోడ్
హెబ్బగోడి
బొమ్మసాంద్ర (టెర్మినల్)
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications