రికార్డు సృష్టించిన భారత నగరం: ట్రాఫిక్ కష్టాల్లో ప్రపంచంలోనే రెండో స్థానం!
ప్రపంచవ్యాప్తంగా పెరిగిన రద్దీ నేపథ్యంలో నెదర్లాండ్స్కు చెందిన ప్రముఖ లొకేషన్ టెక్నాలజీ సంస్థ 'టామ్టామ్' తాజాగా 'గ్లోబల్ ట్రాఫిక్ ఇండెక్స్ 2025' నివేదికను విడుదల చేసింది. ప్రపంచవ్యాప్తంగా వాహనదారులు ఎదుర్కొంటున్న ట్రాఫిక్ కష్టాలపై నిర్వహించిన ఈ సర్వేలో సంచలన నిజాలు వెలుగులోకి వచ్చాయి. 2025వ సంవత్సారానికి టామ్టామ్ సంస్థ విడుదల చేసిన గ్లోబల్ ట్రాఫిక్ ఇండెక్స్ ప్రకారం.. భారత సిలికాన్ వ్యాలీగా పేరుగాంచిన బెంగళూరు నగరం ట్రాఫిక్ సమస్యల్లో మరోసారి ప్రపంచ స్థాయి రికార్డు సృష్టించింది. ట్రాఫిక్ రద్దీలో ప్రపంచంలోనే రెండో స్థానానికి చేరుకుని అందరినీ విస్మయానికి గురి చేసింది. గతేడాది(2024) మూడో స్థానంలో ఉన్న ఈ నగరం.. ఇప్పుడు మెక్సికో సిటీ తర్వాత అత్యంత నెమ్మదైన నగరంగా రికార్డు సృష్టించింది.
నత్తనడకన సాగుతున్న వాహనాలు
ఈ నివేదిక ప్రకారం.. బెంగళూరు రోడ్లపై ప్రయాణం నత్తనడకన సాగుతోంది. బెంగళూరులో వాహనాల సగటు వేగం గంటకు కేవలం 16.6 కిలోమీటర్లు మాత్రమేనని గణాంకాలు చెబుతున్నాయి. ఓ వాహనదారుడు కేవలం 4.2 కిలోమీటర్ల దూరాన్ని దాటడానికి సగటున 15 నిమిషాల సమయం కేటాయించాల్సి వస్తోంది. అంటే నగరవాసులు తమ జీవితంలో అత్యంత విలువైన సమయాన్ని రోడ్లపైనే గడుపుతున్నారు. ముఖ్యంగా 2025 మే 17, శనివారం నాడు నగరంలో అత్యంత అధ్వాన్నమైన ట్రాఫిక్ నమోదైందని.. ఆ రోజు సాయంత్రం వేళల్లో కిలోమీటరు దూరం వెళ్లడం కూడా గగనమైందని నివేదిక పేర్కొంది.

ఏటేటా పెరుగుతున్న సంక్షోభం
బెంగళూరులో ట్రాఫిక్ సమస్య కాలక్రమేణా జటిలమవుతోందని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. 2023లో ప్రపంచవ్యాప్తంగా 6వ స్థానంలో ఉన్న బెంగళూరు, 2024లో 3వ స్థానానికి, ఇప్పుడు 2025లో ఏకంగా 2వ స్థానానికి ఎగబాకింది. నగరంలో నమోదైన వాహనాల సంఖ్యే ఇందుకు ప్రధాన కారణం. 2020-21 ఆర్థిక సంవత్సరంలో కోటిగా ఉన్న రిజిస్టర్డ్ వాహనాల సంఖ్య, ఏప్రిల్ 2025 నాటికి 1.23 కోట్లకు చేరుకుంది. అంటే ఐదేళ్ల కాలంలో సుమారు 23 లక్షల కొత్త వాహనాలు రోడ్లపైకి వచ్చాయి, కానీ దానికి తగ్గట్టుగా రోడ్ల విస్తరణ జరగలేదు.
మౌలిక సదుపాయాల కొరత, ప్రణాళికా లోపం
బెంగళూరు నగరంలోని ట్రాఫిక్ సంక్షోభానికి కేవలం వాహనాల సంఖ్య పెరగడమే కాకుండా.. అస్తవ్యస్తమైన పట్టణ ప్రణాళిక కూడా కారణమని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఐటీ ఉద్యోగులు అధికంగా ఉండే వైట్ఫీల్డ్, ఎలక్ట్రానిక్ సిటీ, ఔటర్ రింగ్ రోడ్ (ORR) వంటి ప్రాంతాల్లో మెట్రో పనులు ఆశించిన వేగంతో జరగడం లేదు. 2007లో ప్రారంభమైన 'నమ్మ మెట్రో' పనులు ఇంకా కీలకమైన ఐటీ కారిడార్లకు పూర్తిస్థాయిలో అనుసంధానం కాలేదు. దీనికి తోడు 2026లో పూర్తి కావాల్సిన సబర్బన్ రైల్వే ప్రాజెక్టు గడువు 2030కి వాయిదా పడటం నగరవాసుల పాలిట శాపంగా మారింది.
రవాణా వ్యవస్థ లోపం
ప్రజా రవాణా వ్యవస్థ మెరుగ్గా లేకపోవడంతో ప్రజలు అనివార్యంగా సొంత వాహనాలను ఆశ్రయిస్తున్నారు. మెట్రో స్టేషన్ లేదా బస్టాప్ నుంచి గమ్యస్థానాలకు చేరుకోవడానికి సరైన షేర్ ఆటోలు లేకపోవడం, ఫుట్పాత్లు అధ్వాన్నంగా ఉండటం వల్ల నడక సాధ్యం కావడం లేదు. ఇరుకైన రోడ్లు, అక్రమ పార్కింగ్, అసంపూర్తిగా ఉన్న ఫ్లైఓవర్ పనులు ట్రాఫిక్ సమస్యను మరింత తీవ్రం చేస్తున్నాయి. ప్రపంచ స్థాయి జాబితాలో మెక్సికో సిటీ ప్రథమ స్థానంలో ఉండగా, బెంగళూరుతో పాటు పుణె నగరం కూడా టాప్-5లో నిలవడం భారతీయ నగరాల్లో ట్రాఫిక్ నిర్వహణ ఎంత బలహీనంగా ఉందో అర్థం చేస్తోంది.
ప్రపంచ స్థాయి జాబితా (టాప్ 5):
*మెక్సికో సిటీ
*బెంగళూరు (భారత్)
*డబ్లిన్ (ఐర్లాండ్)
*లోడ్జ్ (పోలాండ్)
*పుణె (భారత్)
-
తెలుగులో ఇంత బోల్డ్ కంటెంటా...బాబోయ్ అన్ని ఆ సీన్లే..! -
అలిగిన `స్వీటీ`ని ఇంటికి భోజనానికి పిలిచిన విజయ్- రష్మిక -
ఉగాది నుంచి మీన రాశి, కుంభరాశి వారి జాతక ఫలం -
పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ: ఖాతాల్లో రూ 6 వేలు, తాజా నిర్ణయం..!! -
మోదీ కేబినెట్ లోకి జనసేన, ఏపీలో బీజేపీకి మరో మంత్రి పదవి - ఆయనకే ఛాన్స్..!! -
మందుబాబులకు కిక్ ఇచ్చే కబురు- ఏప్రిల్ 1 నుండి.. -
విజయ్, త్రిష పెళ్లి డేట్ ఫిక్స్.. ఎన్నికలకు ముందే..!! -
T20 World Cup Final: అచ్చిరాని స్టేడియంలో కివీస్ తో ఫైనల్-పిచ్ లో కీలక మార్పు..! -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
T20 World Cup: భారత్ కు అదే మైనస్, మాకు ప్లస్-ఫైనల్ పై తేల్చేసిన కివీస్ కెప్టెన్..! -
H1B Visa న్యూ రూల్- గుడ్ న్యూస్ -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్!












Click it and Unblock the Notifications