ప్రభుత్వ లాంచనాలతో ఆజాతశత్రువు అంతిమ వీడ్కోలు, తరలి వచ్చిన నాయకులు!
బెంగళూరు: కేంద్ర మంత్రి అనంత్ కుమార్ కు మంగళవారం బెంగళూరులో ప్రభుత్వ లాంచనాలతో అంతిమ వీడ్కొలు పలికారు. పార్టీలకు అతీతంగా కర్ణాటకతో పాటు వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన నాయకులు అనంత్ కుమార్ పార్థీవదేహానికి నివాళులు అర్పించారు.
మాజీ ఉప ప్రధాని ఎల్.కే. అద్వాణి, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, కేంద్ర మంత్రులు రాజ్ నాథ్ సింగ్, నిర్మలా సీతారామన్, సదానందగౌడ, ధర్మేంద్ర ప్రధాన్, రవిశంకర్ ప్రసాద్, హర్షవర్దన్, పీయుష్ గోయల్, కర్ణాటక మాజీ మంత్రి బీఎస్. యడ్యూరప్ప, బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు అనంత్ కుమార్ కు నివాళులు అర్పించారు.

కర్ణాటక ప్రభుత్వం తరపున కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మంత్రి డీకే. శివకుమార్, కేపీసీసీ అధ్యక్షుడు దినేష్ గుండూరావ్ తదితరులు హాజరైనారు. బసవనగుడి నేషనల్ కాలేజ్ మైదానం నుంచి ఊరేగింపుగా చామరాజపేట హిందూ స్మశానవాటికకు అనంత్ కుమార్ పార్థీవదేహాన్ని తీసుకెళ్లారు.
అనంత్ కుమార్ కు ఇద్దరు కుమార్తెలు ఉండటం, కుమారులు లేకపోవడంతో అంత్యక్రియలు ఎవ్వరు చేస్తారు అని చర్చ జరిగింది. చివరికి అనంత్ కుమార్ సోదరుడు నందకుమార్ హిందూ సాంప్రధాయం ప్రకారం అంత్యక్రియలు నిర్వహించారు. ప్రభుత్వ లాంచనాలతో అనంత్ కుమార్ అంత్యక్రియలు జరిగాయి. అనంత్ కుమార్ అమరహే అంటూ ఆయన అభిమానులు, బీజేపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
-
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
రేవంత్ గుడ్ న్యూస్: 'కల్యాణ లక్ష్మి' సాయం పెంపు, రూ.2,016 పెన్షన్ ఇక నుంచి..!! -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు -
బంగారం కొనేందుకు ఇదే మంచి సమయం.. ఉగాది తర్వాత -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల












Click it and Unblock the Notifications