Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

దెబ్బకు ఢమాల్, ఐటీ హబ్ లో 20 శాతం నీరు కట్, వాళ్లను టార్గెట్ చేసిన జలమండలి, నీళ్లు అంటే !

బెంగళూరు నీటి సరఫరా బోర్డు (BWSSB) కఠిన నిర్ణయాలు తీసుకోవడానికి సిద్దం అయ్యింది. బెంగళూరు నగర ప్రజలకు నీటి సరఫరా సవాలును అధికారులు ఎదుర్కొంటున్నారు. నీటి సరఫరా కోసం అనేక చర్యలలో భాగంగా 20 శాతం నీటిని బల్క్ కస్టమర్లకు తగ్గించాలని జలమండలి అధికారులు నిర్ణయించుకున్నారు. పెద్ద వినియోగదారులు ఎవరు, ఎంతకాలం నుంచి ఎంత మోతాదులో నీటి సరఫరా జరుగుతుంది అని ఆరా తీస్తున్నారు.

బెంగళూరు జలమండలి చైర్మన్ చెప్పిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. బెంగళూరు వాటర్ బోర్డు చైర్మన్ డాక్టర్ వి.రామ్ ప్రసాద్ మనోహర్ నీటి తగ్గింపు అంశంపై పెద్ద నీటి కనెక్షన్లు ఉన్న ప్రధాన వినియోగదారులతో బెంగళూరులోని జలమండలి కార్యాలయంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. దీనికి కొనసాగింపుగా మార్చి 15వ తేదీ నుంచి ప్రధాన వినియోగదారులకు 20% నీటి సరఫరాను బోర్డు ద్వారా దశలవారీగా సరఫరా చేయనున్న కావేరి నీటి నుంచి కోత విధిస్తున్నట్లు ఇదే సమావేశంలో జలమండలి చైర్మన్ రామ్ ప్రసాద్ మనోహర్ తెలిపారు.

Bengaluru Water Board reducing water supply by 20 percent in Bengaluru

జలమండలి బోర్డు సరఫరా చేసే కావేరి నీటిపై మార్చి 15వ తేదీ నుంచి ఏప్రిల్ 1వ తేదీ వరకు 10%, ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఏప్రిల్ 15వ తేదీ వరకు 20% నీటిలో కోత విధిస్తారు. బెంగళూరు నగరంలో మొత్తం 38 ప్రధాన నీటి అనుసంధానిత ప్రధాన వినియోగదారులు ఉన్నారు. నిమ్హాన్స్, ఎయిర్ ఫోర్స్ కమాండింగ్ హాస్పిటల్, విక్టోరియా హాస్పిటల్‌లకు కావేరీ నీటి సరఫరా, వాటి అవసరాల గురించి వివరించారు. ఇలాంటి క్యాంపస్ లతో పాటు నీటిని అనుసంధానించబడిన మిగిలిన 35 మంది ప్రధాన వినియోగదారుల క్యాంపస్ లలోని స్విమ్మింగ్ పూల్స్ కు నీటిని నిలిపివేయనున్నట్లు రామ్ ప్రసాద్ మనోహర్ తెలియజేశారు.

బెంగళూరులోని 1.40 కోట్ల మంది ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని బెంగళూరు జలమండలి బోర్డు తీసుకున్న ఈ నిర్ణయంలో బెంగళూరులో పెద్ద నీటి కనెక్షన్ పొందిన వారు చేతులు కలపాలని జలమండలి అధ్యక్షుడు మనవి చేశారు. పెద్ద నీటి కనెక్షన్ పొందిన వారికి ఇప్పటి వరకు 95% నుండి 100% నీటి సరఫరా బోర్డు ద్వారా సరఫరా చేయబడుతోంది, ఇకపై 20% నీటి సరఫరా తగ్గుతుంది.

Bengaluru Water Board reducing water supply by 20 percent in Bengaluru

బెంగళూరులో జలమండలి అతిపెద్ద కస్టమర్‌లు ఎవరంటే !

నార్త్ వెస్ట్రన్ రైల్వే, హెచ్‌ఏఎల్, ఎయిర్ ఫోర్స్, డిఫెన్స్, సీఆర్‌పీఎఫ్, బయోకాన్, నిమ్హాన్స్, విక్టోరియా హాస్పిటల్‌తో సహా పెద్ద నీటి కనెక్షన్‌లను కలిగి ఉన్న అనేక సంస్థలు తమ క్యాంపస్‌లో నీరు మరియు నీటి సంరక్షణ ప్రాముఖ్యత గురించి అవగాహన కల్పించాలని జలమండలి మనవి చేసింది. క్యాంపస్‌లోని స్విమ్మింగ్ పూల్స్‌ను వెంటనే మూసివేయాలని జలమండలి అధ్యక్షుడు ఆదేశించారు. నీటి సమస్య కారణంగా బెంగళూరు నగరంలోని అన్ని స్విమ్మింగ్ పూల్స్‌ను నిలిపివేసేలా ఉత్తర్వులు జారీ చేయాలని అధికారులను జలమండలి అధ్యక్షుడు ఆదేశించారు.

పెద్ద నీటి కనెక్షన్లు ఉన్న ప్రధాన వినియోగదారులకు నీటి సరఫరా శాతం 20% తగ్గించి ఆ నీటిని జనసాంద్రత ఉన్న ప్రాంతాలు, మురికివాడలు, పేదలు, అత్యంత అవసరమైన ప్రాంతాలకు కావేరి నీటిని సరఫరా చేయాలని జలమండలి అధ్యక్షుడు సంబంధిత ఇంజనీర్లను ఆదేశించారు. ఈ సమావేశంలో ప్రధాన నీటి అనుసంధాన సంస్థల ప్రతినిధులు, బోర్డు చీఫ్ ఇంజనీర్లు, ఇంజనీర్లు, అధికారులు పాల్గొన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+