యోగీ గోరఖ్ పూర్ కు మహర్దశ-4 వేల కోట్లతో టౌన్ షిప్పులు, మెడిసిటీ వంటి 172 ప్రాజెక్టులు ప్రారంభం..
ఉత్తర్ ప్రదేశ్ లో వరుసగా ఆరేళ్ల పాలన పూర్తి చేసుకున్న సీఎం యోగీ ఆదిత్యనాథ్.. తన సొంత నియోజకవర్గం గోరఖ్ పూర్ కు మహర్దశ పట్టించాలని నిర్ణయించుకున్నట్లు కనిపిస్తోంది. గోరఖ్ పూర్ నియోజకవర్గంలో భవిష్యత్ సమీకరణాల్ని దృష్టిలో ఉంచుకుని అభివృద్ధిని కొత్త పుంతలు తొక్కిస్తున్నారు. ఇందులో భాగంగా భారీ ప్రాజెక్టుల్ని యోగీ ప్రారంభించారు.
గోరఖ్పూర్లో సీఎం యోగి ఆదిత్యనాథ్ రూ.3,838 కోట్ల విలువైన 172 ప్రాజెక్టులను తాజాగా ప్రారంభించారు. ఇందులో ప్రపంచస్ధాయి సౌకర్యాలు కలిగిన ఖోరాబర్ టౌన్షిప్, మెడిసిటీ ప్రాజెక్టులు ఉన్నాయి. గోరఖ్పూర్ రైల్వే స్టేషన్ను త్వరలో విమానాశ్రయం తరహాలో సరైన విశ్రాంతి, వేచి ఉండే ప్రదేశాలు, ఇతర సౌకర్యాలతో అభివృద్ధి చేయనున్నట్లు యోగీ ప్రకటించారు. అప్గ్రేడ్ చేసిన రైల్వే స్టేషన్లోని అన్ని సౌకర్యాలు విశ్రాంతి, వేచి ఉండే ప్రాంతాలు, క్యాంటీన్తో సహా విమానాశ్రయం లా ఉంటాయని ఆయన పేర్కొన్నారు.

దళారుల బారిన పడవద్దని, కొత్త టౌన్షిప్ రిజిస్ట్రేషన్ కోసం నేరుగా దరఖాస్తు చేసుకోవాలని ప్రజలను సీఎం యోగీ ఆదిత్యనాథ్ కోరారు. రోడ్ల విస్తరణ, నగరానికి నలువైపులా నాలుగు లేన్ల కనెక్టివిటీ, నగరాన్ని కలిపే ఆరు లేన్ల రహదారి, రింగ్ రోడ్డు వంటి ప్రాజెక్టులతో కొత్త గోరఖ్పూర్ రూపుదిద్దుకుంటోందన్నారు. ఇటీవల జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ సందర్భంగా గోరఖ్పూర్లో కోట్లాది రూపాయల పెట్టుబడి ప్రతిపాదనలు వచ్చాయని పేర్కొన్న ఆదిత్యనాథ్, నగరంలో త్వరలో కొత్త హోటళ్లు, ఆసుపత్రులు, పరిశ్రమలు, కొత్త టౌన్షిప్లు రాబోతున్నట్లు తెలిపారు.
ఈ పెట్టుబడులతో యువతకు ఉపాధి అవకాశాలు కూడా వస్తాయన్నారు. యువత స్థానికంగా ఉపాధి పొందినప్పుడు, వారు సంపాదించిన డబ్బు గోరఖ్పూర్లోనే ఉపయోగించబడుతుందన్నారు. అలాగే తూర్పు యూపీ ప్రాంతంలో కొత్త యూనివర్సిటీలు రానున్నాయని ముఖ్యమంత్రి యోగీ తెలిపారు. పొరుగున ఉన్న ఖుషినగర్ జిల్లాలో త్వరలో బుద్ధ భగవానుడి పేరు మీద వ్యవసాయ విశ్వవిద్యాలయం కూడా రానుందన్నారు. కోట్లాది రూపాయల విలువైన కొత్త ప్రాజెక్టులు ఉత్తరప్రదేశ్ రాష్ట్ర వాస్తవ పరిస్ధితికి అద్దం పడుతున్నాయని యోగీ అభివర్ణించారు.
-
వేసవిలో వాకింగ్ ఎవరికి ఏ సమయంలో మంచిది- ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!! -
అమెరికాకు షాక్, రష్యా నుంచి 60 మిలియన్ బ్యారెళ్ల చమురు! -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!!












Click it and Unblock the Notifications