ఆర్యన్ ఖాన్ కు బిగ్ రిలీఫ్.. డ్రగ్స్ కేసులో క్లీన్ చిట్ ఇచ్చిన ఎన్సీబీ
బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ కు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో క్లీన్ చిట్ ఇచ్చింది. ఆర్యన్ ఖాన్ కేసు పై నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో చార్జిషీట్ ను దాఖలు చేసింది. డ్రగ్స్ ఆన్ క్రూయిజ్ కేసులో బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సిబి ) సరైన సాక్ష్యాధారాలు లేని కారణంగా క్లీన్ చిట్ ఇచ్చినట్టుగా సమాచారం.

ముంబై క్రూయిజ్ షిప్ డ్రగ్స్ కేసులో ఆర్యన్ ఖాన్ కు క్లీన్ చిట్
గతేడాది అక్టోబర్లో ముంబైలోని ఓ క్రూయిజ్ షిప్పై దాడిలో డ్రగ్స్ దొరికిన తర్వాత 14 మంది నిందితులను పేర్కొంటూ యాంటీ డ్రగ్స్ ఏజెన్సీ 6,000 పేజీల ఛార్జిషీట్ను దాఖలు చేసింది. అరెస్టయిన 20 మందిలో ఒకరైన బాలీవుడ్ స్టార్ షారుఖాన్ తనయుడు 23 ఏళ్ల ఆర్యన్ ఖాన్ను నిందితుడిగా పేర్కొనలేదు. ఆర్యన్ మరియు మోహక్ మినహా నిందితులందరూ మాదకద్రవ్యాలను కలిగి ఉన్నట్లు గుర్తించారు అని సీనియర్ ఎన్సిబి అధికారి సంజయ్ కుమార్ సింగ్ పేర్కొన్నారు.

ఆర్యన్ తో పాటు మరో ఐదుగురిపై సాక్ష్యాలు దొరకలేదన్న నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో
ఆర్యన్ ఖాన్తో పాటు మరో ఐదుగురికి వ్యతిరేకంగా తగిన సాక్ష్యాలను నార్కోటిక్స్ ఏజెన్సీ కనుగొనలేకపోయిందని ఆయన తెలిపారు. చార్జిషీట్లో ఆర్యన్ ఖాన్ పేరు లేకపోవడంతో దీంతో ఆర్యన్ ఖాన్ కు ఈ కేసు నుండి ఉపశమనం లభించినట్లయింది. ఇదిలా ఉంటే ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసు దేశ రాజకీయాలలో పెను సంచలనం సృష్టించింది. డ్రగ్స్ కేసులో అరెస్టయిన తర్వాత ఆర్యన్ ఖాన్ మూడు వారాలకు పైగా జైలు జీవితం గడిపాడు. నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో అధికారి సమీర్ వాంఖడే మొదట ఆర్యన్ ఖాన్ మాదకద్రవ్యాల సాధారణ వినియోగదారు మరియు సరఫరాదారు అని పేర్కొన్నారు. ఆర్యన్ ఖాన్ బయటకు రాకుండా శతవిధాలా ప్రయత్నం చేశారు.

కేసు విచారణాధికారి సమీర్ వాంఖడే తొలగింపు
సమీర్ వాంఖడే ఆరోపణలను ఆర్యన్ ఖాన్ న్యాయవాదులు తీవ్రంగా ఖండించారు. దాడి సమయంలో అతని వద్ద ఎటువంటి డ్రగ్స్ కనుగొనబడలేదని పేర్కొన్నారు. బెయిల్ కోసం నానా ఇబ్బందులు పడ్డారు. ఎన్సిబి వాదనలను కూడా కేసును విచారిస్తున్న ప్రత్యేక కోర్టు ప్రశ్నించింది. అటువంటి తీవ్రమైన ఆరోపణలు చేయడానికి కేవలం వాట్సాప్ సందేశాలపై ఆధారపడలేమని పేర్కొంది. ఇక అనేక అవినీతి ఆరోపణల నేపథ్యంలోదర్యాప్తు బాధ్యతలు నిర్వహిస్తున్న అధికారి సమీర్ వాంఖడే తొలగించబడ్డాడు.

చార్జ్ షీట్ దాఖలు చేసిన ఎన్సీబీ.. ఆర్యన్ ఖాన్ కు ఊరట
ఉద్దేశపూర్వకంగా ఆర్యన్ ఖాన్ను లక్ష్యంగా చేసుకున్నాడని, నిందితులను బ్లాక్ మెయిల్ చేయడానికి ప్రయత్నించాడని సమీర్ వాంఖడే ఆరోపణలు ఎదుర్కొన్నాడు. దర్యాప్తులో లోపాలు బయటపడిన తర్వాత కేసు కూడా ముంబైకి చెందిన ఎన్సిబి బృందం నుండి ఢిల్లీకి చెందిన బృందానికి బదిలీ చేయబడింది. ఈ కేసులో ఛార్జిషీట్ దాఖలు చేయడానికి గడువు పూర్తికాగా , మార్చిలో ఏజెన్సీ కోర్టు నుండి రెండు నెలల పొడిగింపును స్వీకరించింది. ఇక ఈ నేపథ్యంలో తాజాగా నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో సెషన్స్ కోర్టులో ఈ కేసులో చార్జిషీటు దాఖలు చేసింది. దీంతో ఆర్యన్ ఖాన్ కు ఊరట లభించింది.












Click it and Unblock the Notifications