మరికొన్ని గంటల్లో థర్డ్ ఫేజ్ పోలింగ్: లౌరియా నుంచి బరిలో వినయ్, ముచ్చటగా మూడోసారి..
మూడో విడత బీహర్ పోలింగ్ మరికొన్ని గంటల్లో జరగనుంది. అయితే గెలుపొటములపై ఉత్కంఠ నెలకొంది. చంపారన్ జిల్లా లౌరియా నుంచి బీజేపీ అభ్యర్థి వినయ్ బీహరీ బరిలో ఉన్నారు. ఇక్కడ 2010 నుంచి వినయ్ గెలుచుకుంటూ వస్తోన్నారు. ఈ సారి కూడా విజయంపై ఆయన ధీమాతో ఉన్నారు. ట్రెండ్స్ కూడా ఆయనకు అనుకూలంగానే ఉన్నాయి.
2010లో ఇండిపెండెంట్గా పోటీ చేసి గెలుపొందారు. 2015లో మాత్రం బీజేపీ నుంచి బరిలోకి దిగి.. విజయం సాధించారు. ఈ సారి కూడా బీజేపీ తరఫున పోటీకి దిగారు. ఇక్కడ ఆర్జేడీ నుంచి శంభు తివారీ, బీఎస్పీ నుంచి రన్ కౌశల్ ప్రతాప్ సింగ్ బరిలో ఉన్నారు.
2011 జనాభా లెక్కల ప్రకారం లౌరియాలో 4 లక్షల 8 వేల 179 మంది ఉన్నారు. ఇక్కడ ఎస్టీలు 13.3, ఎస్సీలు 1.43 శాతం ఉన్నారు. 2 లక్షల 56 వేల 48 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో లక్ష 37 వేల 451 మంది పురుషులు, లక్ష 18 వేల 586 మంది మహిళలు ఉన్నారు. 11 మంది థర్డ్ జెండర్ ఉన్నారు.
2015లో వినయ్కు 57 వేల 351 ఓట్లు వచ్చాయి. ఇందులో 40.47 శాతం ఓటు షేర్ ఉంది. ఆర్జేడీ అభ్యర్థి రాన్ కౌశల్ ప్రతాప్ 17 వేల 573 ఓట్ల తేడాతో ఓడిపోయారు. ప్రతాప్కు 39 వేల 778 ఓట్లు వచ్చాయి. 28 శాతం ఓటు షేర్ ఉంది.