అతిపెద్ద హిందూ ఆలయ నిర్మాణానికి భూమి ఇచ్చిన ముస్లీంలు
పాట్నా: చాలామంది ముస్లీంలు హిందూ ఆలయం నిర్మాణం కోసం అవసరమైన కొంత భూమిని ఇచ్చేందుకు ముందుకు వచ్చారని కిశోర్ కునాల్ అనే మాజీ ఇండియన్ పోలీసు సర్వీస్ అధికారి చెప్పారు. బీహార్ రాష్ట్రంలో అతిపెద్ద హిందూ ఆలయం నిర్మిస్తున్నారు.
దీనికి పలువురు ముస్లీంలు భూమిని ఇస్తున్నారు. అతి పెద్ద హిందూ ఆలయ నిర్మాణానికి ముస్లిం సోదరులు స్థలాన్ని బహూకరించడం గమనార్హం. బీహార్లో మహావీర్ మందిర్ ట్రస్టు ఆధ్వర్యంలో 20 వేలమంది ఒకేచోట కూర్చుని కార్యక్రమాలు తిలకించేలా ప్రపంచంలోకెల్లా అతిపెద్ద హిందూ ఆలయాన్ని నిర్మిస్తున్నారు.

అందుకు కావాల్సిన స్థలాన్ని అక్కడి ముస్లీం సోదరులు పలువురు విరాళంగా అందజేశారని, మరికొందరు నామమాత్రపు రుసుము తీసుకుని ఇచ్చారని మాజీ ఐపీఎస్ అధికారి, ట్రస్టు సభ్యులు కిశోర్ కునాల్ తెలిపారు.
ఈ ప్రాజెక్టుకు ముస్లీం సోదరుల సహకారం ఎంతో గొప్పదని ఆయన అన్నారు. ఆలయ నిర్మాణ పనులను జూన్ నుంచి ప్రారంభిస్తామని, ఇందుకోసం రూ.500కోట్లు కేటాయిస్తున్నట్లు తెలిపారు. విరాట్ రామ్ మందిర్గా పేర్కొంటున్న ఈ ఆలయాన్ని భూకంపాన్ని తట్టుకునేలా నిర్మిస్తున్నట్లు చెప్పారు. ఆలయంలో రాముడు, సీత, లవ, కుశుల విగ్రహాలు ప్రతిష్ఠిస్తామన్నారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications