Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

"చస్తామో లేదో చూద్దాం": నలుగురి ప్రాణాలు తీసిన వింత ప్రయోగం!

చిన్నతనం.. ఆ వయసులో ఉండే అమాయకత్వం, తెలియని విషయాల పట్ల ఉండే కుతూహలం ఒక్కోసారి ఊహించని అనర్థాలకు దారితీస్తుంది. బీహార్లోని ఔరంగాబాద్ జిల్లాలో జరిగిన ఓ ఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. "విషం తింటే చస్తామో లేదో చూద్దాం" అంటూ ఐదుగురు స్నేహితులు చేసిన ఓ ప్రాణాంతక ప్రయోగం నలుగురి ప్రాణాలను బలితీసుకుంది.

అసలేం జరిగిందంటే?
జనవరి 29న ఔరంగాబాద్ జిల్లా మోతీ బిఘా గ్రామంలో ఈ విషాదం చోటుచేసుకుంది. 12 నుంచి 15 ఏళ్ల వయసున్న ఐదుగురు బాలికలు సరదాగా పొలాల్లోకి వెళ్లారు. అక్కడ పక్షులను చంపేందుకు వాడే అత్యంత శక్తివంతమైన విష పదార్థాన్ని వారు వెంట తెచ్చుకున్నారు. ఆ గుంపులో బతికి బయటపడిన ఏకైక బాలిక (14) చెప్పిన వివరాల ప్రకారం.. వారిలో ఒక అమ్మాయి "ఇది తింటే మనం చస్తామో లేదో చూద్దాం రండి" అని ప్రతిపాదించింది.

Bihar Tragedy 4 Girls Die in Deadly Poison Experiment to See If We Live or Die Full Details

ఆ కుతూహలంతో నలుగురు బాలికలు ఆ విషాన్ని నీళ్లలో కలుపుకుని తాగేశారు. "నేను కూడా కొంచెం నోట్లో వేసుకున్నాను కానీ వెంటనే ఉమ్మేశాను. దాంతో నేను బతికాను" అని ఆ బాలిక వెల్లడించింది. విషం తాగిన కొద్దిసేపటికే ఆ నలుగురు బాలికలు కళ్లముందే కుప్పకూలి ప్రాణాలు విడిచారు. భయపడిపోయిన ఆ అమ్మాయి ఇంటికి పరిగెత్తగా.. ఆమె కుటుంబ సభ్యులు వేప నీళ్లు తాగించి వాంతులు చేయించడంతో ఆమె ప్రాణాపాయం నుంచి బయటపడింది.

పోలీసుల వాదన వేరు.. తండ్రి ఆవేదన వేరు!
బతికిన బాలిక "కుతూహలంతో చేసిన ప్రయోగం" అని చెబుతుంటే.. పోలీసులు మాత్రం మరో కోణాన్ని అనుమానిస్తున్నారు. సరస్వతీ పూజ రోజున ఈ బాలికలు కొంతమంది అబ్బాయిలతో తిరుగుతుండగా తల్లిదండ్రులు చూసి మందలించారని.. ఆ అవమానం తట్టుకోలేక అంతా కలిసి ఆత్మహత్య చేసుకున్నారని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. అయితే మరణించిన ఓ బాలిక తండ్రి పోలీసుల వాదనను కొట్టిపారేశారు. "నా కూతురికి 12 ఏళ్లే. అంత చిన్న వయసులో ప్రేమ వ్యవహారాలు ఎలా ఉంటాయి? పోలీసులు చెబుతున్నవి అవాస్తవాలు" అని ఆయన కన్నీరుమున్నీరయ్యారు. ఉపాధి కోసం మహారాష్ట్ర వెళ్లిన ఆయన, కూతురి మరణవార్త విని పరుగెత్తుకుంటూ గ్రామానికి చేరుకున్నారు.

ఒకే చితిపై నలుగురు చిన్నారులు
పేదరికం, సామాజిక ఒత్తిడి కారణంగా ఆ కుటుంబాలు పోస్టుమార్టం వంటి అధికారిక ప్రక్రియల కోసం వేచి చూడలేదు. మరణించిన నలుగురు బాలికలకు ఒకే చితిపై సామూహికంగా అంత్యక్రియలు నిర్వహించారు. ఆ దృశ్యం చూసి గ్రామమంతా కన్నీటి పర్యంతమైంది. ప్రస్తుతం పోలీసులు బతికిన బాలిక స్టేట్‌మెంట్‌ను రికార్డ్ చేసి, కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. చిన్నారులకు విషపూరితమైన పదార్థాల పట్ల అవగాహన లేకపోవడం, కుతూహలం ప్రాణాల మీదకు తెస్తుందని ఈ ఘటన మరోసారి గుర్తుచేస్తోంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+