ముగ్గురు మాజీ సీఎంలకు బీజేపీ కీలక పదవులు, ఉత్తర్వులు జారీ చేసిన అమిత్ షా
న్యూఢిల్లీ: 2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు భారతీయ జనతా పార్టీ (బీజేపీ) కీలక నిర్ణయం తీసుకుంది. ఇటీవలి వరకు మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్లలో ముఖ్యమంత్రులగా పని చేసిన శివరాజ్ సింగ్ చౌహాన్, వసుంధరా రాజే, రమణ్ సింగ్లకు పోస్టులు కట్టబెట్టింది.
పార్టీ అధిష్టానం వారి ముగ్గురిని జాతీయ ఉపాధ్యక్షులుగా నియమిస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా వీటిని జారీ చేశారు. దీంతో రానున్న లోకసభ ఎన్నికల్లో వీరు కీలక పాత్ర పోషించనున్నారు.

రాబోయే లోకసభ ఎన్నికల పైన చర్చించేందుకు అమిత్ షా ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు నేషనల్ కౌన్సెల్ భేటీ జరిగింది. ఈ సందర్భంగా పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది.
బీజేపీ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ ఈ మేరకు ట్వీట్ చేస్తూ ముగ్గురు మాజీ ముఖ్యమంత్రులను (రమణ్, శివరాజ్, వసుంధరా) పార్టీ ఉపాధ్యక్షులుగా నియమించినట్లు తెలిపారు. మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్లలో శివరాజ్ సింగ్ చౌహాన్, రమణ్ సింగ్ ప్రభుత్వాలు మూడు పర్యాయాలు ఉన్నాయి. వసుంధర రాజే ఇటీవలి వరకు రాజస్థాన్ సీఎంగా ఉన్నారు.
-
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో












Click it and Unblock the Notifications