వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాష్ట్రపతి ఎన్నికలు ముగిశాకే యోగి ఆదిత్యనాథ్ రాజీనామా!..

అధిష్టానం ఆదేశాలతో రాష్ట్రపతి ఎన్నికల తర్వాతే వీరు రాజీనామా చేయనున్నారు. వీరితో పాటు యూపీ డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య కూడా రాష్ట్రపతి ఎన్నికల తర్వాతే రాజీనామా చేయనున్నారు.

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: 2017 జులై 24న ప్రస్తుత రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ పదవీ కాలం ముగిసిపోతున్న సంగతి తెలిసిందే. ఈలోపు మరొకరిని రాష్ట్రపతిగా ఎన్నుకోవాల్సి ఉంది. రాష్ట్రపతి ఎన్నికల్లో ఎంపీల ఓట్లు కీలకం కావడంతో.. గోవా సీఎం మనోహర్ పారికర్, ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ లను అప్పటివరకు రాజీనామా చేయకుండా ఉండాల్సిందిగా పార్టీ ఆదేశించినట్లు సమాచారం.

ప్రస్తుతం యోగి ఆదిత్యనాథ్ లోక్ సభ ఎంపీగా, మనోహర్ పారికర్ రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అధిష్టానం ఆదేశాలతో రాష్ట్రపతి ఎన్నికల తర్వాతే వీరు రాజీనామా చేయనున్నారు. వీరితో పాటు యూపీ డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య కూడా రాష్ట్రపతి ఎన్నికల తర్వాతే రాజీనామా చేయనున్నారు.

BJP CMs to resign as MPs after presidential polls

కేశవ్ ప్రసాద్ మౌర్య కూడా లోక్ సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. రాష్ట్రపతి ఎన్నికల తర్వాత ఈ ముగ్గురు ఎంపీ పదవులకు రాజీనామా చేసి రాష్ట్రాల లెజిస్లేటర్ సభ్యులుగా ఎన్నిక కావాల్సిన అవసరముంది.

English summary
Even as its top leadership began discussions on a presidential candidate, the BJP has decided to delay the election of two of its chief ministers to their respective assemblies so as not to lose out on a single vote in the presidential election in July.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X