బిజేపి అధికారం చేపట్టిన తర్వాత యూపి స్వరూపాన్ని మార్చాం.
ఉత్తర ప్రదేశ్ లోని పోలీస్ వ్యవస్థ దేశానికే అదర్శంగా నిలుస్తోందని యూపి ముఖ్యమంత్రి యోగి అదిత్యానాధ్ అన్నారు..బిజేపి అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర స్వరూపాన్నే మార్చామని ఆయన స్ఫష్టం చేశారు.
రాహుల్ పై మండిపడ్డ అమిత్ షా, ప్రజాస్వామ్య హక్కులు కాలరాస్తున్నావంటూ ఫైర్
యూపి స్వరూపాన్ని మార్చాం
ఉత్తర ప్రదేశ్ లో యోగి అదిత్యానాధ్ పదవి కాలం చేపట్టి రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సంధర్భంగా మీడియా తో మాట్లాడారు....ఈ ఆసంధర్భంగా తన హయాంలో లూటిలు,దోమ్మిలు లేకుండా చూశానని చెప్పారు..కాగా ఎస్పి,బిఎస్పి హాయంలో రాష్ట్రంలోని రైతులు ఆత్మహత్యలు కొనసాగాయని విమర్శించారు..మరోవైపు లా అండ్ అర్డర్ దారుణంగా ఉండేదని ఆరోపించారు..ప్రస్థుతం యూపి లా అండ్ అర్డర్ వ్యవస్థ దేశానికే అదర్శంగా నిలుస్తోందని అన్నారు
నా హయంలో మత ఘర్షణలు లేవు
మాఫియా తోపాటు ఆందోళనలు ,దోపిడిలు జరిగేవని అన్నారు..ప్రస్థుతం వాటిని అపగలిగామని చెప్పారు,చాల కాలం పాటు యూపిలో దోపిడి వ్యవస్థ కొనసాగిందని అన్నారు. కాగా 2012 లో 227 ,2013 లో 247, 2014 లో 242, 2015 లో 219 2016 లో 100 పైగా మత ఘర్షణలు చెలరేగాయని పేర్కోన్నారు. ఇందులో కోట్లాది రుపాయల నష్టం వాటిల్లిందని తెలిపారు. కాగా బిజేపి పరిపాలనలో ఇక్క మత పతపరమైన ఘర్షణ కూడ చెలరేగలేదని వివరించారు.వీటికి తోడుగా కిడ్నాప్ లతోపాటు ఆసిడ్ దాడులు జరిగాయని తెలిపారు..కాగా రెండు సంవత్సరాల్లో ఎలాంటీ పెద్ద ఎత్తున జరిగిన సంధర్భాలు లేవని గుర్తు చేశారు.
రాష్ట్ర పోలీసుల నిర్ణాయల్లో జోక్యం చేసుకోలేదు.
ఇక రాష్ఠ్ర ప్రభుత్వం పోలీసుల నిర్ణయాల్లో జోక్యం చేసుకోలేదని తెలిపారు..కాగా రాష్ట్రంలో 73 మంది క్రిమినల్స్ ను ఎన్ కౌంటర్ అయ్యారని అయితే దురదృష్టవశాత్తు ఎన్ కౌంటర్ లో ఆరుగురు పోలీసులు కూడ చనిపోయారని చెప్పారు..కాగ గతంలో ఎప్పుడు లేనట్టుగా రాష్ట్ర అవతరణ దినోత్సవ ఉత్సవాలను సైతం ప్రశాంతంగా జరుపుకున్నామని చెప్పారు.ప్రెస్ మీట్ లో ఆయనతోపాటు యూపి పార్టీ అధ్యక్షుడు ఇతర మంత్రులు పాల్గోన్నారు.