నా భర్తను జైల్లోనే చంపాలనుకుంటున్నారు: బీజేపీపై కేజ్రీవాల్ భార్య సునీత సంచలనం
రాంచీ: తన భర్త అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal)ను తీహార్ జైల్లోనే చంపాలని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కోరుకుంటోందని సునీత కేజ్రీవాల్ సంచలన ఆరోపణలు చేశారు. ఆయనకు ఇచ్చే ప్రతి ఆహారాన్ని జైలు అధికారులు పర్యవేక్షిస్తున్నారని అన్నారు. 'ఇండియా' కూటమి ఆధ్వర్యంలో రాంచీలో నిర్వహించిన బహిరంగ సభలో కేంద్రంపై తీరుపై తీవ్ర విమర్శలు గుప్పించారు.
కేంద్ర ప్రభుత్వ నియంతృత్వానికి వ్యతిరేకంగా విపక్షాల కూటమి పోరాడుతోందన్నారు. తన భర్త అరవింద్ కేజ్రీవాల్ ను చంపాలని అనుకుంటున్నారని సునీత ఆరోపించారు. ఆయనకిచ్చే ఆహారాన్ని పర్యవేక్షించేందుకు కెమెరాలు ఏర్పాటు చేశారన్నారు. మధుమేహంతో బాధపడుతున్న కేజ్రీవాల్.. 12 ఏళ్లుగా ఇన్సులిన్ తీసుకుంటున్నారని.. కానీ, ఆయనకు జైల్లో మాత్రం ఇన్సులిన్ ఇవ్వడం లేదని ఆరోపించారు. ఆయనకు 50 యూనిట్ల ఇన్సులిన్ అవసరమని చెప్పారు.

ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్ లను ఈడీ అరెస్టు చేయడంపై సునీత మండిపడ్డారు. నేరం రుజువు కాకుండానే వాళ్లను జైల్లో పెట్టారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వానిది నియంతృత్వమేనని అన్నారు. మంచి విద్య, ఆరోగ్య వసతులు కల్పించడమే తన భర్త కేజ్రీవాల్ చేసిన తప్పిదమా? అని ప్రశ్నించారు. ప్రజల కోసం కేజ్రీవాల్ తన ప్రాణాలను పణంగా పెట్టారన్నారు.
ఐఆర్ఎస్ అధికారి అయిన కేజ్రీవాల్.. ప్రజా సేవ కోసం ముందుకు వచ్చారని సునీత తెలిపారు. కాగా, ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్టయిన కేజ్రీవాల్ ప్రస్తుతం తీహార్ జైల్లో ఉన్న విషయం తెలిసిందే. ఇది ఇలావుండగా, ఇండియా కూటమి రాంచీలో నిర్వహించిన బహిరంగ సభలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. జైల్లో ఉన్న అరవింద్ కేజ్రీవాల్, హేమంత్ సోరెన్ ల కోసం సభా వేదికపై ప్రత్యేకంగా ఖాళీ కుర్చీలు ఉంచారు. సభా వేదిక ఆవరణలో ఈ ఇద్దరు నేతల భారీ కటౌట్లను ఏర్పాటుచేశారు.
-
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక












Click it and Unblock the Notifications