రాహుల్ జర్మనీ ట్రిప్ పై బీజేపీ విమర్శలు..! ప్రియాంక ఘాటు కౌంటర్..!
పార్లమెంట్ శీతాకాల సమావేశాల వేళ అధికార ఎన్డీయే, విపక్ష ఇండియా కూటమి మధ్య ఉభయసభలతో పాటు బయటా తీవ్ర మాటల యుద్దం సాగుతోంది. ముఖ్యంగా ఎన్నికల సంస్కరణలు, వందేమాతరం వంటి కీలక అంశాలపై చర్చలు జరుగుతున్న నేపథ్యంలో ఇరు కూటముల నేతలు విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకుంటున్నాయి. ఇదే క్రమంలో లోక్ సభలో విపక్ష నేత రాహుల్ గాంధీపై బీజేపీ నేత ఒకరు చేసిన విమర్శలకు ఆయన సోదరి ప్రియాంక గాంధీ ఘాటుగా స్పందించారు.
పార్లమెంట్ శీతాకాల సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో జర్మనీ పర్యటనకు వెళ్లబోతున్న రాహుల్ గాంధీపై బీజేపీ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా ఎక్స్ లో విమర్శలకు దిగారు. రాహుల్ గాంధీని ఉద్దేశించి పార్టీలు చేసుకునే నాయకుడు(లీడర్ ఆఫ్ పార్టీస్), టూర్లు చేసే నాయకుడు (లీడర్ ఆఫ్ టూర్స్) అంటూ ఎగతాళిగా ట్వీట్ చేశారు. దీనిపై కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ పార్లమెంట్ బయట స్పందించారు.

Leader of Partying & Paryatan (LoP) pic.twitter.com/8pl9Y2V3nX
— Shehzad Jai Hind (Modi Ka Parivar) (@Shehzad_Ind) December 10, 2025
కాంగ్రెస్ నాయకులు తమ రక్షణ కోసం "అసభ్యకరమైన పనులు" చేస్తున్నారని విమర్శిస్తూ రాహుల్ గాంధీ ఎజెండాను సైతం పూనావాలా ప్రశ్నించారు. మళ్ళీ భారత్ బద్నామి? బీహార్ ఎన్నికల సమయంలో ఆయన ఎక్కడ ఉన్నారు? ఇది మరో సెలవు. సాధారణ ప్రజలు పని సెషన్ల మధ్య సెలవులు తీసుకుంటారు - ఈ వ్యక్తి రెండు సెలవు సెషన్ల మధ్య పనిచేస్తున్నట్లు అనిపిస్తుందన్నారు.

#WATCH | On BJP criticising Lok Sabha LoP and Congress MP Rahul Gandhi's upcoming visit to Germany, Congress MP Priyanka Gandhi Vadra says, "Modi ji spends almost half of his working time outside the country. Why are they raising questions on the Leader of the Opposition's… pic.twitter.com/qrpYOZANXw
— ANI (@ANI) December 10, 2025
దీనిపై ప్రియాంక స్పందిస్తూ.. ప్రధాని మోడీ తన పని సమయంలో దాదాపు సగం దేశం వెలుపల గడుపుతారని, ప్రతిపక్ష నాయకుడి పర్యటన గురించి వారు ఎందుకు ప్రశ్నిస్తున్నారని పూనావాలా పేరెత్తకుండానే నిలదీశారు. మరోవైపు డిసెంబర్ 15 నుండి 20 వరకు రాహుల్ గాంధీ బెర్లిన్ పర్యటనకు వెళ్లనున్నారు. ఈ సమయంలో ఆయన జర్మన్ ప్రభుత్వ అధికారులను కలవడంతో పాటు అక్కడి భారతీయులతో ముచ్చటిస్తారని ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ ప్రకటించింది. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు డిసెంబర్ 19తో ముగియనున్నాయి.
-
ఏప్రిల్ రెండో వారంలో తెలంగాణాకు ప్రధాని మోదీ.. బీజేపీ బిగ్ ప్లాన్ ఇదే! -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!!












Click it and Unblock the Notifications