అసెంబ్లీలో జాతీయ గీతానికి అవమానం, గవర్నర్ క్షమాపణకు డిమాండ్
జమ్ము కాశ్మీర్ అసెంబ్లీలో జాతీయ గీతానికి అవమానం జరిగిందని బీజేపీ శాసన సభ్యుడు ఆగ్రహం వ్యక్తం చేశారు.
శ్రీనగర్: జమ్ము కాశ్మీర్ అసెంబ్లీలో జాతీయ గీతానికి అవమానం జరిగిందని బీజేపీ శాసన సభ్యుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్ష నేషనలిస్ట్ కాంగ్రెస్, కాంగ్రెస్ పార్టీలు అవమానించాయని ధ్వజమెత్తారు.
అసెంబ్లీ సమావేశాల సందర్భంగా విపక్షాలు జాతీయ గీతాన్ని అవమానించాయన్నారు. అందుకు వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది. అసెంబ్లీ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభమయ్యాయి.

ఉభయ సభల నుద్దేశించి ప్రసంగించేందుకు గవర్నర్ వోహ్రా సభలకు హాజరయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో నెలకొన్న అశాంతి గురించి విపక్ష కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్ నేతలు పీడీపీ-భాజపా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేయడం మొదలుపెట్టారు.
దాంతో గవర్నర్ తన ప్రసంగాన్ని అర్థాంతరంగా ముగించారు. మరో పక్క జాతీయ గీతాలాపన జరుగుతుండగా గవర్నర్ వెళ్లిపోవడం, ప్రతిపక్షాలు ఆందోళన చేయడంపై బీజేపీ మండిపడింది. ఇది జాతీయ గీతానికి తీరని అవమానమని, విపక్ష కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్, గవర్నర్ క్షమాపణ చెప్పాలని ఆ పార్టీ ఎమ్మెల్యే రవీందర్ రైనా డిమాండ్చేశారు.












Click it and Unblock the Notifications