సీఎంను మాజీ పీఎం దేవేగౌడ నిద్రపోనివ్వరు, రాజకీయ చదరంగం: కాంగ్రెస్ బలి: మాజీ మంత్రి !
బెంగళూరు: మాజీ ప్రధాని హెచ్.డి. దేవేగౌడ తన కుమారుడు, కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామిని మనఃశాంతిగా పని చేసుకోవడానికి అవకాశం ఇవ్వరని బీజేపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి వి. సోమణ్ణ సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ ప్రధాని దేవేగౌడ ఎవ్వరినీ మనఃశాంతిగా ఉండనివ్వరని, అది ఆయన కొడుకు అయినా సరే వదిలిపెట్టరని బీజేపీ నాయకుడు వి. సోమణ్ణ ఆరోపించారు. మంగళవారం తుమకూరులోని సిద్దగంగా మఠంకు భేటీ అయిన వి. సోమణ్ణ మీడియాతో మాట్లాడతూ దేవేగౌడ ఎవ్వరినీ నిద్రపోనివ్వరని ఆరోపించారు.

దేవేగౌడ గారడి
దేవేగౌడ రాజకీయ గారడిలో తాను పెరిగానని, ఆయన రాజకీయ చదరంగం తాను దగ్గర నుంచి చూశానని బీజేపీ ఎమ్మెల్యే వి. సోమణ్ణ అన్నారు. జేడీఎస్ తో పొత్తుపెట్టుకున్న పార్టీలను మాజీ ప్రధాని హెచ్.డి. దేవేగౌడ ముప్పుతిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగిస్తారని బీజేపీ ఎమ్మెల్యే వి. సోమణ్ణ ఆరోపించారు.

ప్రజలు టార్గెట్
మాజీ ప్రధాని హెచ్.డి. దేవేగౌడ రాజకీయంగా ఆటలు ఆడటానికి ప్రజలను పావులుగా ఉపయోగించుకుంటారని వి. సోమణ్ణ ఆరోపించారు. సంకీర్ణ ప్రభుత్వాన్ని, అధికారులను ఎవ్వరినీ మనఃశాంతిగా పని చేసుకోవడానికి దేవేగౌడ విడిచిపెట్టరని వి. సోమణ్ణ విమర్శించారు.

యడ్యూరప్ప సీఎం
బీజేపీ అధికారంలోకి వస్తే బీఎస్. యడ్యూరప్ప మళ్లీ ముఖ్యమంత్రి అవుతారని, ఆయనకు ఆ అవకాశం ఇవ్వకూడదనే ఒకే ఒక్క కారణంతో కాంగ్రెస్ పార్టీతో జేడీఎస్ పొత్తుపెట్టుకుందని వి. సోమణ్ణ ఆరోపించారు. దేవేగౌడ ఆడుతున్న రాజకీయ చదరంగంలో కాంగ్రెస్ బలిపశువు అయ్యిందని వి. సోమణ్ణ వ్యంగంగా అన్నారు.

ఎవరి మాట వినరు
మాజీ ప్రధాని హెచ్.డి. దేవేగౌడ ఎవ్వరిమాట వినరని, ఆయన మనసులోని ఆలోచనలు సంకీర్ణ ప్రభుత్వం మీద వేసి పనులు చేయించుకుంటారని వి. సోమణ్ణ ఆరోపించారు. కొడుకు కుమారస్వామి ఇప్పుడు ముఖ్యమంత్రి అయినా దేవేగౌడ మనసులోని ఆలోచనలతోనే సీఎంగా ఆయన పనులు చేస్తారని, ఇది ప్రజలకు మంచిదికాదని వి. సోమణ్ణ విమర్శించారు.
-
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
బడ్జెట్ లో ఉద్యోగులు - మహిళలకు కొత్త వరాలు - పెన్షన్, 'కళ్యాణ లక్ష్మీ' పెంపు ఇలా..!! -
కేబినెట్ లోకి విజయశాంతి, పీసీసీ చీఫ్ మార్పు - ఆ ఇద్దరూ ఔట్..కొత్తగా..!! -
బెంగళూరులో రెండో భారీ ఎయిర్ పోర్ట్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
భారీగా పెరిగిన డీజిల్ ధరలు, తగ్గుతున్న నిల్వలు- కొత్త రేట్లు ఇలా..!! -
ఏమి సేతు రా: 2 గంటలు వెయిట్ చేస్తే గానీ అమిత్ షా దొరకలేదు












Click it and Unblock the Notifications