అమిత్ షా మాస్టర్ ప్లాన్, ఒకే దెబ్బకు సీఎం సీటు, లోక్ సభ ఎన్నికలు, అప్పకు అధికారం !
న్యూఢిల్లీ: కర్ణాటక రాజకీయాలు రసవత్తరంగా మారిపోయాయి. 2018 శాసన సభ ఎన్నికల్లో అత్యధిక సీట్లు గెలుచుకున్న బీజేపీ ప్రతిపక్షానికే పరిమితం అయ్యింది. కర్ణాటకలో కాంగ్రెస్-జేడీఎస్ పార్టీలు కలిసి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చెయ్యడంతో బీజేపీ షాక్ కు గురైయ్యింది.
కర్ణాటకలో అధికారానికి బీజేపీ దూరం అయినప్పటి నుంచి ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఆ రాష్ట్రంలో అడుగుపెట్టలేదు. ఇప్పుడు కర్ణాటకలో చక్రం తిప్పడానికి అమిత్ షా సిద్దం అయ్యారు. ఇదే నెల 25వ తేదీ కర్ణాటకలో అమిత్ షా పర్యటించడానికి సిద్దం అయ్యారని బీజేపీ వర్గాలు తెలిపాయి.

త్వరలో లోక్ సభ ఎన్నికలు రానున్న పరిస్థితుల్లో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా పర్యటన ఆసక్తిగా మారింది. బెంగళూరు నగరంలోని ప్రైవేట్ హోటల్ లో అమిత్ షా ఉదయం నుంచి రాత్రి వరకు బీజేపీ నాయకులతో చర్చలు జరపనున్నారని సమాచారం.
కర్ణాటకలోని సంకీర్ణ ప్రభుత్వంపై అసమ్మతితో ఉన్న కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు ఎమ్మెల్యేలు బీజేపీకి మద్దతు ఇవ్వడానికి సిద్దం అయ్యారని తెలిసింది. సెప్టెంబర్ నెలలో కర్ణాటకలోని సంకీర్ణ ప్రభుత్వం కుప్పకూలుతుందని బీజేపీ నాయకులు జోస్యం చెబుతున్నారు.
ఇలాంటి సమయంలో అమిత్ షా బెంగళూరు పర్యటనకు శ్రీకారం చుట్టడం, మాజీ సీఎం బీఎస్ యడ్యూరప్ప ఢిల్లీ వెళ్లిన మరుసటి రోజు మళ్లీ బెంగళూరు చేరుకోవడంతో ఎప్పుడు ఏమి జరుగుతుందో ఎవ్వరూ చెప్పలేకపోతున్నారు. మొత్తం మీద కర్ణాటక రాజకీయాలు రసవత్తరంగా మారిపోయాయి.
-
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్












Click it and Unblock the Notifications