రాజ్యసభ ఎన్నికలు: 14 మంది అభ్యర్థులతో బీజేపీ జాబితా, ఏ రాష్ట్రం నుంచి ఎవరంటే?
న్యూఢిల్లీ: రాజ్యసభ ఎన్నికల నామినేషన్లకు గడువు సమీపిస్తుండటంతో రాజకీయ పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటిస్తున్నాయి. తాజాగా, భారతీయ జనతా పార్టీ ఏడు రాష్ట్రాల్లో 14 మంది పేర్లను ఎంపిక చేసి ఆదివారం రాత్రి విడుదల చేసింది. దీంట్లో అత్యధికంగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రం నుంచి ఏడుగురు, బీహార్ నుంచి ఇద్దరు, ఛత్తీస్గఢ్, హర్యానా, కర్ణాటక, ఉత్తరాఖండ్, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల నుంచి ఒక్కొక్కరు చొప్పున ఉన్నారు.
రాష్ట్రాల నుంచి అభ్యర్థుల వివరాలు:
ఉత్తరప్రదేశ్ నుంచి ఆర్పీఎస్ సింగ్, డా. సుధాన్షు త్రివేది, చౌదరి తేజ్ వీర్ సింగ్, సాధనా సింగ్, అమర్ పాల్ మౌర్య, సంగీత బల్వంత్, నవీన్ జైన్

బీహార్ నుంచి డా. ధర్మశీల గుప్తా, భీమ్ సింగ్
ఛత్తీస్గఢ్ నుంచి రాజా దేవేంద్ర ప్రతాప్ సింగ్
హర్యానా నుంచి సభాష్ బరాలా
కర్ణాటక నుంచి నారాయణ కష్టస భండగే
ఉత్తరాఖండ్ నుంచి మహేంద్ర భట్
పశ్చిమబెంగాల్ నుంచి సమిక్ భట్టాచార్య.
దేశ వ్యాప్తంగా 15 రాష్ట్రాల నుంచి ఏప్రిల్ నెలలో ఖాళీ అయ్యే 56 రాజ్యసభ స్థానాలకు కేంద్ర ఎన్నికల సంఘం జనవరిలో నోటిఫికేషన్ విడుదల చేసింది. ఫిబ్రవరి 8 నుంచి రాజ్యసభ ఎన్నికలకు దరఖాస్తులు స్వీకరణ ప్రారంభమైంది. ఫిబ్రవరి 15తో ముగియనుంది. ఫిబ్రవరి 27న పోలింగ్ నిర్వహించి అదే రోజు ఓట్ల లెక్కింపు, ఫలితాలు విడుదల చేస్తారు.
भाजपा की केंद्रीय चुनाव समिति ने विभिन्न राज्यों में होने वाले आगामी राज्यसभा के द्विवार्षिक चुनाव हेतु निम्नलिखित नामों पर अपनी स्वीकृति प्रदान की। pic.twitter.com/9MBlj1KxA2
— BJP (@BJP4India) February 11, 2024
కాగా, అత్యధికంగా ఉత్తరప్రదేశ్లో 10 స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఇక, బీహార్ 6, మహారాష్ట్ర 6, పశ్చిమబెంగాల్ 5, మధ్యప్రదేశ్ 5, గుజరాత్ 4, కర్ణాటక 4, ఒడిశా, రాజస్థాన్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో మూడేసి చొప్పున స్థానాలకు, హర్యానా, ఛత్తీస్గఢ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో ఒక్కో రాజ్యసభ స్థానానికి ఎన్నిక జరగనుంది. కాగా, ఆదివారంనాడే టీఎంసీ కూడా నలుగురి పేర్లతో జాబితాను విడుదల చేసిన విషయం తెలిసిందే.
-
ఏప్రిల్ రెండో వారంలో తెలంగాణాకు ప్రధాని మోదీ.. బీజేపీ బిగ్ ప్లాన్ ఇదే! -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!!












Click it and Unblock the Notifications