బీజేపీ,ఆర్ఎస్ఎస్లు గాడ్ ప్రేమికులు కాదు... గాడ్సే ప్రేమికులు... రాహుల్ గాంధీ
భోపాల్ బీజేపీ అభ్యర్థి ప్రగ్యాసింగ్ ఠాకూర్ గాడ్సే పై చేసిన వ్యాఖ్యలు రేపుతుండడంతో ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ స్పందించారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ నేతలు వాళ్లు నిజంగా దేవుడిని ప్రేమించే వాళ్లు కాదని వాళ్లు నాథూరాం గాడ్'సే ప్రేమికులు అంటూ ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. ఆయన ట్వీట్లో భాగాంగా ''నాకు ఇప్పుడు అర్ధమయింది.బీజేపీ గాడ్- కే లవర్స్ కాదు గాడ్-సే లవర్స్ అంటూ ఆయన ట్వీట్ చేశారు''.
కాగా ప్రాగ్యా వ్యాఖ్యలు దుమారం రేపుతున్న విషయం తెలిసిందే. ఆమే గాంధీని చంపిన గాండ్సేను దేశభక్తడంటూ వివాదస్పద వ్యాఖ్యలు చేసింది. దీంతో ఆ వ్యాఖ్యలపై దేశవ్యాప్త నిరసనలు వ్యక్తమయ్యాయి. ఈనేపథ్యంలోనే బీజేపీ హైకమాండ్ తోపాటు ప్రధాని నరేంద్రమోడీ కూడ నేరుగా స్పందించారు. ఆమే చేసిన వ్యాఖ్యలను నేను ఎన్నటికి క్షమించనని అన్నారు. గాంధీపై ఇలాంటీ వ్యాఖ్యలు చేయడం ముమ్మాటికి తప్పని స్పష్టం చేశారు. అలాంటీ మాటాలు మాట్లాడేప్పుడు వందసార్లు ఆలోచించాలని ఆయన ఆన్నారు. కాగా అంతకు ముందే బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ ఆమేతో పాటు బీజేపీ నేతలు చేసిన వ్యాఖ్యలు పార్టీకి సంబంధం లేదని స్పష్టం చేశారు. అవి వ్యక్తిగతమని తెలిపారు. కాగా ఆ వ్యాఖ్యలపై వారం రోజుల్లోగా వివరణ ఇవ్వాలని ఆయన వారిని ఆదేశించారు.
దీంతో సాధ్వీ వ్యాఖ్యలు స్వంతపార్టీ నేతలనే ఇరుకున పెట్టడడంతో సాధ్వీ చేసిన వ్యాఖ్యలపై వెనక్కి తగ్గింది. పార్టీ ఆదేశాల మేరకు ఆ వ్యాఖ్యలు చేసిన కొద్ది గంటల్లోనే తన వ్యాఖ్యలు ఎవరికైన ఇబ్బంది కల్గించి ఉంటే క్షమించాలని కోరారు. మరోవైపు మీడియా తన వ్యాఖ్యలను వక్రికరించిందని ప్రకటించారు.