ట్రంప్ నిర్ణయం: బీజేపీ ఎంపీ ఆదిత్యనాథ్ సంచలనం
ముస్లీం మెజార్టీ దేశాల పైన అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ విధించిన ట్రావెల్ బ్యాన్ పైన బీజేపీ ఎంపీ యోగి ఆదిత్యనాథ్ స్పందించారు.
వాషింగ్టన్: ముస్లీం మెజార్టీ దేశాల పైన అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ విధించిన ట్రావెల్ బ్యాన్ పైన బీజేపీ ఎంపీ యోగి ఆదిత్యనాథ్ స్పందించారు. ట్రంప్ నిర్ణయాన్ని చాలామంది వ్యతిరేకిస్తున్నారు. కానీ అదిత్యనాథ్ మాత్రం ప్రశంసించారు.
ఉగ్రవాదాన్ని సమూలంగా నిర్మూలించేందుకు ఇది మంచి నిర్ణయమన్నారు. భారత్ కూడా ట్రంప్లానే వ్యవహరించాలని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉత్తరప్రదేశ్లో త్వరలో జరగనున్న ఎన్నికల నేపథ్యంలో బులంద్షహర్లో ప్రచారం నిర్వహించారు.

భారత్లో ఉగ్రవాద కార్యకలాపాలు నిర్మూలించేందుకు భారత్ కూడా ట్రంప్ వంటి నిర్ణయాలు తీసుకోవాలన్నారు. మూడు దశాబ్దాలుగా పశ్చిమ యూపీలోని పరిస్థితులు కాశ్మీర్ పరిస్థితులను తలపిస్తున్నాయన్నారు.
ముజఫర్నగర్, మీరట్, ఘజియాబాద్లోనూ ఇటువంటి పరిస్థితులే నెలకొన్నాయన్నారు. అధికార సమాజ్వాదీ పార్టీ విధానాలతోపాటు బీఎస్పీ విధానాలే ఇందుకు కారణమన్నారు.1990లో కాశ్మీర్లో జరిగిందే ఇప్పుడు యూపీలో జరుగుతోందన్నారు. కాశ్మీర్ లోయను కోల్పోయాం కానీ పశ్చిమ ఉత్తరప్రదేశ్ను మాత్రం కోల్పోయేది లేదన్నారు.
-
Trump: నువ్వేగా ఇరాన్ వార్ చేద్దామన్నావ్..! ఆయనపై నెపం నెట్టేసిన ట్రంప్..! -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
అదే జరిగితే ఇరాన్ ను అంతం చేస్తాం: ట్రంప్ వార్నింగ్ -
Donald trump: ట్రంప్ ప్రకటనతో కుప్పకూలిన చమురు, గ్యాస్ ధరలు..! -
ట్రంప్ మాటలు నమ్మొద్దు.. యుద్ధం కొనసాగుతోంది: ఇరాన్ సంచలనం -
ట్రంప్ కు ముందు నుయ్యి, వెనుక గొయ్యి-ఎలాగో చెప్పిన మాజీ రక్షణమంత్రి..! -
అమెరికా అలా చేస్తే ట్రంప్ తల తీసుకెళ్తాం: ఇరాన్ సంచలన వార్నింగ్ -
అమెరికాకు షాక్, రష్యా నుంచి 60 మిలియన్ బ్యారెళ్ల చమురు! -
చేతులెత్తేసిన ట్రంప్.. ప్రధాని మోదీకి ఫోన్.. -
ఇజ్రాయెల్ కు షాకిచ్చిన ట్రంప్, ఇప్పుడు ఏం చేద్దాం? -
భారత్ కు బిగ్ షాక్- హార్ముజ్ జలసంధి పూర్తిగా మూసివేయనున్న ఇరాన్












Click it and Unblock the Notifications