వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

త్రిపురలో 48 మందితో బీజేపీ తొలి జాబితా-మాజీ సీఎం విప్లవ్ కు షాక్-కేంద్రమంత్రి ప్రతిమకు చోటు

|
Google Oneindia TeluguNews

త్రిపురలో వచ్చే నెల 16న జరిగే అసెంబ్లీ ఎన్నికలకు రంగం సిద్ధమవుతోంది. ఇప్పటికే పొత్తులపై అన్ని పార్టీలు దృష్టిసారించి ముమ్మర చర్చలు జరుపుతున్నాయి. అదేసమయంలో గత ఎన్నికల్లో ఒంటరిగా బరిలోకి దిగి గెలిచిన బీజేపీ ఈసారి కూడా పొత్తులు కుదరకపోవడంతో ఒంటరి పోరుకు సిద్ధమైంది. దీంతో 48 మంది అభ్యర్ధులతో బీజేపీ ఇవాళ తన తొలి జాబితాను విడుదల చేసింది. మరో 12 మంది అభ్యర్ధుల్ని రెండో జాబితాలో ఖరారు చేయబోతోంది.

ఇవాళ విడుదల చేసిన బీజేపీ త్రిపుర అసెంబ్లీ ఎన్నికల తొలిజాబితాలో 48 మంది అభ్యర్ధులకు చోటు దక్కింది. ఇందులో ఇద్దరు ముస్లింలకు కూడా బీజేపీ చోటు కల్పించింది. అలాగే మాజీ సీఎం విప్లవ్ కుమార్ దేవ్ కు ఈ జాబితాలో బీజేపీ చోటు కల్పించలేదు. గతంలో అర్ధాంతరంగా ఆయన్ను సీఎంగా తప్పించిన బీజేపీ... ఈసారి ఎన్నికల్లో ఆయనకు టికెట్ ఇవ్వకపోతే భారీ షాక్ కానుంది. మరోవైపు కేంద్రమంత్రి ప్రతిమా భౌమిక్ కు ఈసారి ఎమ్మెల్యేగా టికెట్ ఇచ్చారు.

bjps first list out for tripura assembly elections 2023, no ticket for ex cm biplab deb

బీజేపీ తొలి జాబితాలో 21 మంది పాత వారికే టికెట్లు కేటాయించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాజీవ్ భట్టాచార్జీ గతసారి మాజీ సీఎం విప్లవ్ దేవ్ గెలిచిన బనమాలిపూర్ నుంచి పోటీ చేయనున్నారు. రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు విప్లవ్ దేవ్ దానిని వదులుకుని ఎంపీ అయినప్పటి నుంచి ఆ స్థానం ఖాళీగా ఉంది. కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత మంత్రి ప్రతిమా భూమిక్ ధన్‌పూర్ నుండి పోటీ చేయబోతున్నారు. ఆమె గతంలో సిపిఐ(ఎం) కు చెందిన మాజీ సిఎం మాణిక్ సర్కార్‌పై పోటీ చేసి ఓడిపోయారు.

English summary
bjp has released its first list for upcoming tripura assembly elections 2023 today with 48 candidates.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X