మహారాష్ట్రలో బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ .. రావణ , కుంభకర్ణులతో పోల్చుకుంటూ విమర్శలు
మహారాష్ట్ర ఎన్నికలకు సమయం ఆసన్నమైన తరుణంలో పొలిటికల్ హీట్ పెరిగిపోయింది. అధికార బిజెపి, ప్రతిపక్ష కాంగ్రెస్ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఇతిహాసాలలోని పాత్రలతో పోల్చుకుంటూ ఒకరు విమర్శనాస్త్రాలు గుప్పించు కుంటున్నారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ను కాంగ్రెస్ నాయకులు రావడంతో పోలీసులు ఉంటే, భారతీయ జనతా పార్టీ మొత్తం కాంగ్రెస్ నాయకులను రావణుడి సోదరుడు కుంభకర్ణుడుతో పోలుస్తున్నారు.
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పిస్తున్న నాయకులు హిందూ ఇతిహాసం రామాయణం లోని పాత్రలతో పోల్చుకుంటూ తిట్టుకుంటున్నారు. రాష్ట్రంలోని రైతుల సమస్య, పాలన సమస్యలు గురించి మాట్లాడుతూ కాంగ్రెస్ సీనియర్ నాయకులు నానా పటోల్ మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ ను రావణుడితో పోల్చారు. మహారాష్ట్రలో రావణుడి పాలన సాగుతున్నదని ఆయన విమర్శలు గుప్పించారు. అంతే కాదు రావణుడు చాలా అహంకారి అని, అలాంటి అహంకార పాలన బీజేపీ సాగిస్తుంది అని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు నానా పటోల్ మండిపడ్డారు.

ఇక ఈ వ్యాఖ్యలకు కౌంటర్ గా బీజేపీ సైతం విమర్శలు గుప్పిస్తుంది. బిజెపి అధికార ప్రతినిధి మాధవ్ బండారి ప్రధాని నరేంద్ర మోడీ రామరాజ్యము వైపు దేశాన్ని నడిపిస్తున్నారని , కాంగ్రెస్ పార్టీ నాయకులంతా కుంభకర్ణుడి లా నిద్ర పోతున్నారని విమర్శలు గుప్పించారు. మొత్తానికి ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో బిజెపి కాంగ్రెస్ నాయకుల మధ్య మాటల యుద్ధం గట్టిగానే నడుస్తుంది. ఒకరిపై ఒకరు విమర్శనాస్త్రాలు సంధించుకుంటూ రాజకీయాన్ని వేడెక్కిస్తున్నారు. ఈసారి ఎన్నికలు అటు అధికార బీజేపీకి, ఇటు ప్రతిపక్ష కాంగ్రెస్ కు ప్రతిష్టాత్మకం కావటంతో ఇరు పార్టీలు ఎన్నికల వ్యూహాలకు పదును పెడుతున్నారు.
మహారాష్ట్రలో ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ ఎన్సీపీ పొత్తుతో ముందుకు వెళ్లనుంది . ఈ నేపధ్యంలో బీజేపీ టెన్షన్ పడుతుంది. ఇక ఇక్కడ బీజేపీ తీరుపై శివేసేన సైతం అసంతృప్తి వ్యక్తం చేస్తున్న నేపధ్యంలో ఈ ఎన్నికలు బీజేపీకి కత్తి మీద సామే. ఇక ఎన్నికల ముందు ఎన్సీపీ అధినేత శరద్ పవార్ కు షాక్ తగిలింది. మహారాష్ట్ర కోపరేటివ్ బ్యాంక్ కుంభకోణంలో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. కాంగ్రెస్ తో పొత్తులతో ఎన్నికలకు వెళ్లనున్న నేపధ్యంలో ఈడీ కేసు ఎన్సీపీకి గట్టిదెబ్బగానే చెప్పుకోవాలి. అయితే ఇదంతా బీజేపీనే చేస్తుందని ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications