వారణాసిలో మమతకు నల్లజెండాలతో నిరసన సెగ, ఎన్నికల్లో ఓటమి భయంతోనే ఇలా.. దీదీ కౌంటర్
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి యూపీ ఎన్నికల నేపథ్యంలో బిజెపికి కంచుకోట అయిన వారణాసిలో అడుగడుగునా నిరసనలు ఎదురయ్యాయి. సమాజ్వాదీ పార్టీకి మద్దతుగా ప్రచారం చేసేందుకు బుధవారం వారణాసిలో అడుగుపెట్టిన పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ విమానాశ్రయం నుంచి దశాశ్వమేధ ఘాట్కు వెళ్తుండగా నిరసనకారులు నల్ల జెండాలతో తమ నిరసనను తెలియజేశారు. పీఎం మోడీ నియోజకవర్గంలో అడుగడుగునా ఆందోళనకారులు నల్లజెండాలతో మమత పర్యటనను వ్యతిరేకించారు.

అడుగడుగునా నల్ల జెండాలతో మమత పర్యటనకు అవాంతరాలు
మమత దశాశ్వమేధ్ ఘాట్కు వెళ్లే క్రమంలో, బిజెపి మద్దతుదారులు మొదట చేత్గంజ్ ప్రాంతంలో, ఆ తర్వాత గోదోలియా వద్ద నల్లజెండాలు చూపించడంతో ఆమెకు పలు చోట్ల నిరసనలు ఎదురయ్యాయి. చెత్గంజ్లో, జై శ్రీ రామ్ అని అరుస్తున్న జనం నల్ల జెండాలను చూసి, పశ్చిమ బెంగాల్ సీఎం తీవ్ర అసహనానికి గురై తన కారు ఆపి రోడ్డుపైకి వచ్చి నిరసనకారుల మధ్య లోకి వెళ్లారు. నల్లజెండాలతో ముందుకు రావాలని మమతాబెనర్జీ బిజెపి కార్యకర్తలకు సూచించారు.

ఇవి నల్లజెండాలు కాదు.. మీరు ఓడిపోతున్నారన్న భయం అన్న మమతా బెనర్జీ
ఇవి నల్లజెండాలు కాదని, ఎన్నికల్లో ఓడిపోతామనే భయం అంటూ పేర్కొన్న మమతా బెనర్జీ మీరు ఎన్నికల్లో ఓడిపోతున్నారు అంటూ తేల్చి చెప్పారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా "జై యుపి, జై హింద్" అని నినాదాలు చేశారు. ఆపై గౌడౌలియా వద్ద ఆమెకు బీజేపీ నిరసనకారులు నల్లజెండాలు చూపించారు. అయితే జిల్లా పోలీసులు ఆందోళనకారులను పక్కకు నెట్టివేశారు .నిరసనల గురించి సమాచారం అందుకున్న ఎస్పీ కార్యకర్తలు ప్రతీకారంగా గోదోలియా క్రాసింగ్ వద్ద గుమిగూడారు.

అనేక ఉద్రిక్తతల మధ్య దశాశ్వమేధ ఘాట్కు మమతా బెనర్జీ
నిరసనకారులైన బీజేపీ, ఎస్పీ రెండు గ్రూపులు ఆందోళనకు శ్రీకారం చుట్టిన నేపథ్యంలో ఉద్రిక్తతలు చోటు చేసుకోకుండా పోలీసులు వారిని చెదరగొట్టారు. ఆపై మమతా బెనర్జీ దశాశ్వమేధ ఘాట్కు చేరుకుని గంగా మందిరంలో పూజలు చేశారు. ఆమె ఘాట్ మెట్లపై కూర్చొని ప్రసిద్ధ గంగా హారతిని కూడా తిలకించారు. మార్చి 7న చివరి దశలో ఓటు వేయనున్న వారణాసి మరియు చుట్టుపక్కల ప్రాంతాలలో ఎస్పి అధినేత అఖిలేష్ యాదవ్తో కలిసి మమత రెండు ర్యాలీలలో ప్రసంగిస్తారని సమాచారం.

రెండు రోజుల పాటు వారణాసిలోనే మమతా బెనర్జీ
మరో రెండు రోజుల పాటు మమత వారణాసిలోనే ఉండనున్నారు. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీపై నిరసనల నేపథ్యంలో జిల్లా యంత్రాంగం భద్రతను కట్టుదిట్టం చేసింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా భద్రతను మరింత పటిష్టం చేసింది. ఇక మమతా బెనర్జీ ఉత్తర ప్రదేశ్ ఎన్నికల్లో బీజేపీని ఓడించాలని పిలుపునిస్తూ ఎన్నికల ప్రచారాన్ని సాగిస్తున్న విషయం తెలిసిందే.
-
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..! -
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!! -
బంగారం మళ్ళీ పెరిగింది: తులం ఈ రోజు ఎంత? కారణాలేంటి?












Click it and Unblock the Notifications