Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Video: ఆర్ఎస్ఎస్ కార్యాలయంపై బాంబు దాడి: సీపీఎం పనేనంటూ ఆరోపణలు

తిరువనంతపురం: కేరళలోని కన్నూర్​ జిల్లాలో కొందరు దుండగులు రెచ్చిపోయారు. పయ్యనుర్​‌లోని రాష్ట్రీయ స్వయంసేవక్​ సంఘ్​(ఆర్​ఎస్ఎస్​) కార్యాలయంపై బాంబు విసిరారు. ఈ ఘటన మంగళవారం తెల్లవారుజామున 1:30 గంటల సమయంలో జరిగింది. దాడి జరిగిన సమయంలో కార్యాలయంలో కార్యకర్తలు ఉన్నారని, అయితే, ఎలాంటి గాయాలు కాకుండా తప్పించుకున్నారని పోలీసుల తెలిపారు.

ఈ దాడిలో ఆర్ఎస్ఎస్ కార్యాలయ కిటికీలు, అద్దాలు, తలుపులు ధ్వంసం అయ్యాయి. ఈ క్రమంలో బీజేపీ, ఆర్ఎస్ నేతలు ఈ దాడికి పాల్పడింది సీపీఎం గూండాలేననని ఆరోపిస్తున్నారు. అధికార పార్టీ రాష్ట్రంలోని ప్రజలకు రక్షణ కల్పించడం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు.

ఈ దాడి వెనుక అధికార సీపీఎం ఉందని ఆర్​ఎస్ఎస్ ఆరోపించింది. పయ్యనుర్​ సీపీఎం నాయకుడు ధన్‌రాజ్​ వర్ధంతి నేపథ్యంలో ఈ దాడి జరిగింది. అతడి మరణం వెనుక ఆర్​ఎస్ఎస్ కార్యకర్తలు ఉన్నారనే ఆరోపణలు ఉన్నాయి. కాగా, ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టామని, నిందితులను త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.

ఇది ఇలావుండగా, జూన్​ 30న కేరళలోని తిరువనంతపురంలో ఉన్న సీపీఎం ప్రధాన కార్యాలయమైన ఏకేజీ సెంటర్​పై బాంబు దాడి జరిగింది. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. దీంతో కేరళలో పోలీసులు హైఅలర్ట్​ ప్రకటించారు. వయనాడ్‌​లోని కాంగ్రెస్​ సీనియర్​ నేత, ఎంపీ రాహుల్​ గాంధీ కార్యాలయంపై దాడి జరిగిన కొన్ని రోజులకు ఈ ఘటన జరగడం గమనార్హం.

BOMB hurled at RSS office in Kerala: BJP blames on CPM

జూన్​ 30 రాత్రి 11:30 గంటల సమయంలో ద్విచక్రవాహనంపైన వచ్చిన ఓ వ్యక్తి.. సీపీఎం ప్రధాన కార్యాలయం గేటుపై బాంబు విసిరి పరారయ్యాడు. ఈ దృశ్యాలు స్థానిక సీసీటీవీ కెమెరాకు చిక్కాయి. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదని పోలీసులు వెల్లడించారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+