గోఎయిర్ విమానంకు బాంబు బెదిరింపు కాల్: శ్రీనగర్లోనే నిలిచిపోయిన ప్లేన్, తనిఖీ
న్యూఢిల్లీ: విమానం లోపల బాంబు ఉందని టెలిఫోన్ కాల్ హెచ్చరికతో.. ఢిల్లీకి వెళ్లాల్సిన గోఎయిర్ విమానాన్ని సోమవారం శ్రీనగర్లో నిలిపివేసినట్లు అధికారులు తెలిపారు. బాంబు బెదిరింపు కాల్ నేపథ్యంలో విమానాన్ని పూర్తిగా పరిశీలిస్తున్నారు. అయితే, విమానంలో ఏమీ దొరకలేదని కాశ్మీర్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ విజయ్ కుమార్ తెలిపారు.
విమానంలో బాంబు ఉందని మరో ప్రైవేట్ క్యారియర్ సూపర్వైజర్కు కాల్ రావడంతో గోఎయిర్ విమానం తిరిగి ఢిల్లీకి వెళ్లాలని భావించినా.. శ్రీనగర్ ఎయిర్ టెర్మినల్ వద్ద నిలిపివేసినట్లు అధికారులు తెలిపారు.

ఢిల్లీకి కాల్ ఫాలో అయ్యిందని, ఆ పాయింట్ నుంచి నెంబర్ ఆఫ్ చేయబడిందని వారు చెప్పారు. పోలీసులు ఈ విషయాన్ని పరిశీలిస్తున్నారని, ఎయిర్ టెర్మినల్ కార్యకలాపాలు ఎటువంటి ఇబ్బంది లేకుండా కొనసాగుతున్నాయని విజయ్ కుమార్ తెలిపారు.
కాగా, ఇటీవల కొందరు ఆకయితాయిలు ఇలాంటి ఫోన్లు చేస్తున్నారు. అయితే, నిర్లక్ష్యం చేస్తే భారీ మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితులు ఉండటంతో పోలీసులు, భద్రతా సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు.
-
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్ను చిత్తు చేసిన SRH! -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!!












Click it and Unblock the Notifications