తీస్తా దంపతులకు బెయిల్ మంజూరు
న్యూఢిల్లీ/ముంబై: గుజరాత్ కు చెందిన సామాజిక కార్యకర్త తీస్తా సెతల్వాద్, ఆమె భర్త జావేద్ ఆనంద్ లు ఊపిరి పీల్చుకున్నారు. వీరిద్దరికి మధ్యంతర బెయిల్ మంజూరు కావడంతో కొంత ఊరట లభించింది. శుక్రవారం బాంబే హై కోర్టు తీస్తా దంపతులకు బెయిల్ మంజూరు చేసింది. వచ్చే నెల 10వ తేది వరకు వీరిని అరెస్టు చెయ్యరాదని కోర్టు సూచించింది.
2002లో గుజరాత్ లో జరిగిన అల్లర్లలో నాశనమైన గుల్బర్గ్ సొసైటీలో దాడులలో మరణించిన వారి స్మారకార్థం మ్యూజియం ఏర్పాటు చేస్తామంటు తీస్తా దంపతులు విదేశాల నుండి నిధులు స్వీకరించారు. అధికారుల అనుమతి లేకుండా ఫోర్డ్ ఫౌండేషన్ నుండి విదేశీ నిధులు సేకరించారు.

తరువాత ఆ నిధులను దుర్వినియోగం చేశారని, తీస్తా మద్యం సేవించడానికి, ఆమె కేశసౌందర్యానికి ఎక్కువ ఖర్చు చేశారని ఆరోపిస్తూ తీస్తా సెతల్వాద్, ఆమె భర్త జావేద్ ఆనంద్ ల మీద కేసు నమోదు అయ్యింది. సీబీఐ అధికారులు ఈ కేసు దర్యాప్తు చేస్తున్నారు.
తమకు ముందస్తు బెయిల్ మంజూరు చెయ్యాలని తీస్తా దంపతులు సీబీఐ ప్రత్యేక కోర్టును ఆశ్రయించారు. అయితే సీబీఐ కోర్టు బెయిల్ ఇవ్వడానికి నిరాకరించడంతో వీరు బాంబే హై కోర్టును ఆశ్రయించారు. బీజేపీ ప్రభుత్వం కావాలనే మమ్మల్ని వేధిస్తున్నదని తీస్తా సెతల్వాద్ దంపతులు ఆరోపిస్తున్నారు.
-
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ!












Click it and Unblock the Notifications