విజయ్ మాల్యా కేసులో తీర్పు ఇవ్వనున్న కోర్టు.. లండన్ కు సీబీఐ అధికారులు
ఢిల్లీ : బ్యాంకు రుణాల ఎగవేతతో విదేశాలకు పారిపోయారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న కింగ్ ఫిషర్ అధినేత విజయ్ మాల్యాను భారత్ కు అప్పగించే విషయంపై బ్రిటన్ కోర్టు సోమవారం తీర్పు వెలువరించే ఛాన్సుంది. మాల్యాను వెనక్కి పంపించాలన్న భారత్ అభ్యర్థన మేరకు అక్కడి కోర్టు నిర్ణయం తీసుకోనుంది. బ్రిటన్ కోర్టు విచారణ నిమిత్తం హాజరయ్యేందుకు సీబీఐ అధికారి సాయి మనోహర్ తో పాటు మరికొందరు అధికారులు లండన్ వెళ్లారు. అయితే అవినీతి ఆరోపణల నేపథ్యంలో సీబీఐ స్పెషల్ డైరెక్టర్ రాకేశ్ అస్థానా ను సెలవులపై పంపింది కేంద్రం. దీంతో ఆయనకు బదులుగా సాయి మనోహర్ ను పంపించారు ఉన్నతాధికారులు.

వివిధ బ్యాంకులకు 9వేల కోట్ల రూపాయలను ఎగ్గొట్టినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న మాల్యా 2016లో బ్రిటన్ కు వెళ్లిపోయారు. ఆయనపై మనీల్యాండరింగ్ తో పాటు పలు కేసులు నమోదు కావడంతో వెనక్కి పంపాలని బ్రిటన్ ప్రభుత్వాన్ని కోరింది భారత్. ఈ అభ్యర్థనపై లండన్ లోని వెస్ట్ మినిస్టర్ మెజిస్ట్రేట్ కోర్టులో విచారణ జరుగుతోంది. అయితే సోమవారం (10-12-2018) అక్కడి కోర్టు ఇచ్చే తీర్పు కీలకం కానుంది. మాల్యా విషయంలో కోర్టు తీర్పు వెలువరించాక బ్రిటన్ హోంమంత్రి నిర్ణయం తీసుకోనున్నారు.
-
ప్రపంచంలో సంతోషకరమైన దేశం ఇదే.. మారిన లెక్కలు.. -
ఈ రాత్రికి ఆయనొక్క మాట చెబితే చాలు.. బంగారం తలకిందులే! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
ఉస్తాద్ భగత్ సింగ్ ట్విట్టర్ రివ్యూ: బొమ్మ బ్లాక్ బస్టర్..!! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
విశాఖపట్నం-తిరుపతి మధ్య మరో రెగ్యులర్ ఎక్స్ ప్రెస్-ఈ రోజుల్లో..! హాల్ట్ లు ఇవే..! -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్












Click it and Unblock the Notifications