బిఎస్ఎఫ్ ఎయిర్ క్రాఫ్ట్ క్రాష్: చివరి నిమిషాల్లో...
ఢిల్లీ: ఢిల్లీలోని ద్వారక ప్రాంతంలో మంగళవారం నాడు బిఎస్ఎఫ్ చార్టర్ విమానం కూలి పదిమంది మృతి చెందారు. 11 మంది కూర్చోవడానికి ఉన్న ఆ విమానం మంగళవారం ఉదయం 9.40 నిమిషాలకు కూలిన విషయం తెలిసిందే. సాంకేతిక సమస్య కారణంగా అది కూలింది.
సాంకేతిక సమస్య కారణంగా పైలట్ తప్పనిసరి పరిస్థితుల్లో విమానాన్ని విమానాశ్రయం వైపుకు మరల్చవలసి వచ్చిందని అధికారులు విశ్లేషిస్తున్నారు. కానీ, అంతలోనే ఆ విమానం చెట్టును ఢీకొని కూలిపోయింది.
ఈ విమానం కూలిపోయిన చివరి కొద్ది నిమిషాలకు సంబంధించిన వివరాలు వెల్లడయ్యాయి. సాంకేతిక సమస్య విషయం తెలియగానే విమానంలోని కెప్టెన్ భగవతి ప్రసాద్ భట్, కో పైలట్, కెప్టెన్ రాజేశ్ శివ్రాన్లు ఏటీసీని ఎమర్జెన్సీ ల్యాండింగ్ కోసం అనుమతి అడిగారు.

ఏటీసీ నుంచి అనుమతి వచ్చాక విమానాన్ని మళ్లించారు. అయితే, అది చెట్టును ఢీకొంది. ఆ తర్వాత సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లో పడింది.
విమానం 1700 అడుగుల ఎత్తుకు వెళ్లిన తర్వాత ఏటీసీతో సంబంధాలు తెగిపోయాయి. ఆ తర్వాత మళ్లీ మాములుగానే సంబంధాలు కొనసాగాయి. ఎమర్జెన్సీ ల్యాండింగ్ కోసం అడగగానే, దాని సేఫ్ ల్యాండింగ్ కోసం తాము పలు విమానాలను మళ్లించామని ఓ అధికారి చెబుతున్నారు.
-
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారి బెంగళూరు-కడప-విజయవాడపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన -
కుప్పకూలిపోతున్న బంగారం ధరలు.. !! -
అన్నదాత సుఖీభవ డబ్బుల జమ.. అన్నీ శుభవార్తలు చెప్పిన సీఎం చంద్రబాబు -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు












Click it and Unblock the Notifications