జంతువులా చూసేది: బిఎస్పీ ఎంపీ భార్యపై పనిమనిషి
న్యూఢిల్లీ: బహుజన సమాజ్ పార్టీ (బిఎస్పీ) ఎంపి ధనుంజయ సింగ్ సతీమణి జాగృతి సింగ్ తనను కూడా వేధించిందని మరో పని మనిషి ముందుకు వచ్చింది. ఎంపీ భార్య తనను తీవ్రంగా కొట్టిందని, ఒంటికి నిప్పంటించిందని ప్రస్తుతం తాను నడవలేని పరిస్థితుల్లో ఉన్నానని ఆమె ఆరోపించారు.
తనను ఎంపీ భార్య ఓ జంతువులా చూసేదని, మోకాళ్ల మీద కూర్చో బెట్టి చేతులు ఉపయోగించకుండా అన్నం తినమని చెప్పేదని, తీవ్రంగా వేధించేదని ఆరోపించింది.

ప్రస్తుతం ఎంపి, ఆయన సతీమణిలు అరెస్టై రిమాండులో ఉన్నారు. సమాచారం మేరకు ఇంట్లో పని చేసే వారిని ఎంపీ సతీమణి జాగృతి సింగ్ పది నెలలుగా వేధిస్తోంది. దీనికి సంబంధించి 302, 307 ఐపిఎస్ సెక్షన్స్ల కింద ఆమె పైన ఎఫ్ఐఆర్ నమోదయింది.
కాగా, రేఖ అనే పని మనిషి మృతికి సంబంధించి ఎంపీ భార్య జాగృతి సింగ్ను న్యూఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. విపరీతంగా కొట్టడం వల్లనే పని మనిషి మరణించిందని, గత పది నెలలుగా పని మనిషిని జాగృతి సింగ్ విపరీతంగా వేధిస్తోందని, హింసకు గురి చేస్తోందని ఆరోపణలు వచ్చాయి.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications