Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

బెంగళూరులో స్తంభించిన బస్సులు- బోసిపోయిన మెజస్టిక్

కర్ణాటకలో ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికుల నిరవధిక సమ్మె ఆరంభమైంది. ఈ తెల్లవారు జామున 6 గంటల నుంచి బస్సులు స్తంభించాయి. రాష్ట్రవ్యాప్తంగా బస్సులేవీ కూడా రోడ్డెక్కలేదు. బెంగళూరు సహా రాష్ట్రవ్యాప్తంగా అన్ని నగరాలు, పట్టణాల్లో బంద్ ప్రభావం కనిపించింది. ప్రయాణికులు, విద్యార్థులు బస్సుల కోసం పడిగాపులు పడుతున్నారు.

తమ డిమాండ్ల సాధన కోసం కేఎస్ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికుల ఐక్య కార్యాచరణ కమిటీ కొంతకాలంగా పోరాడుతోంది. సోమవారం కూడా ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్, రవాణా శాఖ మంత్రి రామలింగారెడ్డితో సమావేశం అయ్యారు. అవి ఫలించలేదు. దీనితో నిరవధిక సమ్మెకు కేఎస్ఆర్టీసీ జేఏసీ పిలుపునిచ్చింది.

Bus services hit as KSRTC employees began an indefinite strike across Karnataka passengers stranded

38 నెలలుగా చెల్లించని జీతాల బకాయిలను పరిష్కరించడం, 15 శాతం జీతాల పెంపు వంటి 12 అంశాల డిమాండ్లను తక్షణమే పరిష్కరించాలనేది జేఏసీ డిమాండ్. అందులో కొన్నింటికి మాత్రమే పచ్చజెండా ఊపారు సిద్ధరామయ్య. ఆర్థిక భారం పడని అంశాలను అప్పటికప్పుడు అమలు చేయడానికి అంగీకరించారు. దీనికి జేఏసీ నేతలు అంగీకరించలేదు.

అదే సమయంలో కొన్ని నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. సీనియర్ అడ్వొకేట్ ఎన్ పీ లమృతేష్ కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు. దీనితో హైకోర్టు సైతం ఈ విషయంలో జోక్యం చేసుకుంది. సమ్మెను వాయిదా వేయాలని ఆదేశించింది. ఈ ఆదేశాల ఆధారంగా కేఎస్ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ అక్రమ్ పాషా.. ఉత్తర్వులు ఇచ్చారు. ఉద్యోగులు కోర్టు ఆదేశాన్ని పాటించాలని, సమ్మెలో పాల్గొనకూడదని అన్నారు.

హైకోర్టు ఉత్తర్వుల్లో ఎటువంటి స్పష్టత లేకపోవడాన్ని జేఏసీ అధినేత అనంత సుబ్బారావు ప్రస్తావించారు. తమకు హైకోర్టు నుంచి ఆర్డర్ అందిందని, ఇందులో విషయాలు అస్పష్టంగా ఉన్నాయని అన్నారు. తాము నిరవధిక సమ్మెను యధాతథంగా ప్రారంభిస్తామని, తమ వాదనలను హైకోర్టు వినిపిస్తామని చెప్పారు. శాంతియుతంగా తమ నిరసన తెలియజేస్తాని, ఎస్మా వంటి ప్రభుత్వ బెదిరింపులకు భయపడవద్దని అనంత సుబ్బారావు సూచించారు.

కాగా.. ఈ నిరవధిక సమ్మె ప్రభావం.. ప్రజా రవాణా తీవ్రంగా పడింది. ఈ తెల్లవారు జాము నుంచి కర్ణాటక అంతటా బస్సులు రోడ్లపైకి రాలేదు. ఫలితంగా ప్రయాణికులు అవస్తలకు గురి అవుతున్నారు. బెంగళూరు, మైసూరు, హుబ్బళ్లి, మంగళూరు వంటి ప్రధాన నగరాల్లో కేఎస్ఆర్టీసీ బస్సులు పూర్తిగా నిలిచిపోయాయి.

రాష్ట్రంలోని నాలుగు రోడ్డు రవాణా సంస్థలు KSRTC, BMTC, NWKRTC, KKRTCకి చెందిన బస్సులేవీ కూడా రోడ్డెక్కలేదు. పలుచోట్ల ప్రయాణికులు ప్రైవేట్ వాహనాలను ఆశ్రయించడం కనిపించింది. ఆటోలకు డిమాండ్ ఏర్పడింది. దీనితో ప్రైవేట్ ఆపరేటర్లు, ఆటో డ్రైవర్లు అధిక డబ్బులను వసూలు చేస్తోన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+