నాన్నకు ప్రేమతో:మిమ్మలను ఒక్కసారి నాన్నా అని పిలవొచ్చా ..స్టాలిన్ చివరి లేఖ
Recommended Video

ఓ రాజ్యానికి రాజు కావొచ్చు కానీ తల్లికి తండ్రికి బిడ్డ ఎప్పుడూ బిడ్డనే... తమిళనాడు రాజకీయాల్లో ద్రవిడ సూరీడు ముత్తువేల్ కరుణానిధి అస్తమించాడు. అయితేనేమి తన సిద్ధాంతాలను తన వారసత్వాన్ని తమిళ ప్రజల గొంతును వినిపించాల్సిందిగా తన రెండో కుమారుడు రాజకీయ వారసుడు అయిన స్టాలిన్కు బాధ్యతలు అప్పజెప్పి శాశ్వతంగా నిద్రపోయారు. కరుణానిధికి ఉన్న కుమారుల్లోకెల్లా ఆయనకు అత్యంత సన్నిహితంగా మెలిగింది మాత్రం స్టాలినే అని చెప్పక తప్పదు. తండ్రి పట్ల అంతే గౌరవంతో స్టాలిన్ మెలిగారు.
తండ్రి మాట జవదాటని బిడ్డడుగా స్టాలిన్ మంచి పేరు తెచ్చుకున్నాడు. అయితే తండ్రి మరణంతో స్టాలిన్ పెద్ద అండను కోల్పోయాడు. బాధను దిగమింగుతూ మిగతా కుటుంబ సభ్యుల్లో ధైర్యం నింపుతున్నాడు. కరుణానిధికి ఉన్న అఖండ అభిమానులకు, పార్టీ కార్యకర్తలకు తలైవా అంత కాపోయినా... తాను అండగా ఉంటానని భరోసా ఇస్తున్నాడు.

ఇక తండ్రితో తను గడిపిన మధుర క్షణాలను, రాజకీయ ఆటుపోట్లను, మననం చేసుకుంటున్నాడు స్టాలిన్. తండ్రికి చివరిసారిగా లేఖ రాశాడు. ఆ లేఖ చదివితే ఎవరికైనా సరే కన్నీళ్లు ఆగవు. ఇదే ఆ లేఖ సారాంశం
" మిమ్మలను నాన్నా...నాన్నా.. అని పిలువడంకంటే తలైవా (నా నాయకుడు)అనే ఎక్కువగా పిలిచాను...
ఒకే ఒక్క సారి నిన్ను నాన్నా అని పిలువనా....
ప్రతి సారీ బయటకు వెళ్లేటప్పుడు ఫలానా చోటికి వెళుతున్నానని చెప్పే నీవు...
ఈసారి ఎక్కడికి వెళుతున్నావో ఎందుకు చెప్పలేదు..?
నీ మరణాంతరం నీ సమాధిపై ఈ మాటలు ఉండాలని 33 ఏళ్ల క్రితమే మీరు చెప్పారు...
'జీవితాంతం విశ్రాంతి లేకుండా పనిచేసిన వ్యక్తి ఇక్కడ విశ్రాంతి తీసుకుంటున్నారు ..'
ఇక తమిళులకు చేయాల్సిందంతా చేశానని భావించి ఆ తృప్తితో వెళ్లిపోయావా" అంటూ స్టాలిన్ తన చివరి లేఖను తండ్రికి రాశారు.
ఇక తమిళ భాషను, తమిళ జాతిని ఎంతగానో ప్రేమించే కరుణానిధి అక్కడి ప్రజలను తమిళంలోనే మాట్లాడాలని తరుచూ చెప్పేవాడు. ఒకసారి డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ స్టాలిన్ ఓ కార్యక్రమానికి హాజరయ్యారు. అక్కడ మాట్లాడుతూ తమిళులు తమ పిల్లలకు తమిళ పేర్లే పెట్టాలని చెప్పాడు. అయితే తనకు మాత్రం స్టాలిన్ అనే పేరు ఎలా వచ్చిందో అక్కడి ప్రజలకు వివరించాడు. తనపేరు ముందుగా అయ్యాదురై పెట్టాలని కరుణానిధి భావించారని అయితే చివరి నిమిషంలో తన పేరును స్టాలిన్గా ఎందుకు మార్చాడో ఆయన చెప్పారు.
ద్రవిడ ఉద్యమ నేత పెరియార్ను కరుణానిధి అయ్యా అని పిలిచేవాడట. ఇక డీఎంకే వ్యవస్థాపకులు కరుణానిధి రాజకీయ గురువు అన్నాదురైలోని దురై పేరును తీసి స్టాలిన్కు అయ్యాదురై అని పెట్టాలని భావించడట. అయితే స్టాలిన్ 1953 మార్చిలో జన్మించిన సమయంలో కరుణానిధి రష్యా కమ్యూనిస్ట్ నేత జోసెఫ్ స్టాలిన్ సంతాప సభలో ప్రసంగిస్తున్నారట. ఆ సమయంలో వేదికపై ఉన్న కరుణానిధికి ఈ విషయం తెలిసింది. తన ప్రసంగంలో తన కుమారుడికి స్టాలిన్ అని నామకరణం చేస్తున్నట్లు ప్రకటించాడు. అలా స్టాలిన్కు తమిళ పేరు కాకుండా రష్యా కమ్యూనిస్టు స్టాలిన్ పేరు పెట్టడం జరిగింది. ఇక కరుణానిధి మిగతా పిల్లలకు మాత్రం తమిళ పేర్లే పెట్టారు.
తండ్రి చాటు బిడ్డగా స్టాలిన్ ఎదిగాడు. తండ్రి నుంచే రాజకీయల్లో ఓనమాలు దిద్దాడు. కరుణానిధిలోని ఉద్యమ స్ఫూర్తిని వారసత్వంగా పొందాడు. ఇక డీఎంకే పగ్గాలు చేపట్టేందుకు సిద్దమవుతున్నాడు. అయితే అళగిరి నుంచి ఎలాంటి ఆటంకాలు ఏర్పడకపోతే... ఇది సాధ్యమవుతుంది. లేదంటే పరిస్థితి ఎంతవరకు వెళుతుందో వేచిచూడాలి.
-
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్












Click it and Unblock the Notifications