బిల్లు 5వేలు దాటిందా... అయితే క్రెడిట్, డెబిట్ కార్డు వాడాల్సిందే?
న్యూఢిల్లీ: నల్లధనాన్ని అరికట్టేందుకు నగదు లావాదేవీలను తగ్గించేందుకు ప్రభుత్వం ఆ దిశగా చర్యలు ప్రారంభించింది. ఇందులో భాగంగా 5 స్టార్ హోటళ్లలో ఉన్నా, అక్కడ తిన్న బిల్లులను కార్డుల ద్వారానే చెల్లించాలనే ఉత్తర్వులు జారీ చేసేందుకు సిద్ధమైంది.
ఆర్థిక శాఖ కార్యదర్శి రాజీవ్ మహర్షి మంగళవారం మీడియాతో మాట్లాడుతూ బిల్లు ఐదు వేలు రూపాయలు దాటిన ఏ లావాదేవికైనా తప్పనిసరిగా క్రెడిట్ కార్డు లేదా డెబిట్ కార్డు ద్వారానే చెల్లింపులు చేయాల్సి ఉంటుందన్నారు. క్రెడిట్, డెబిట్ కార్డుల వినియోగాన్ని పెంచడానికి అవసరమైన విధివిధానాలను రూపొందించేందుకు కేంద్ర ప్రభుత్వం సోమవారం కమిటీని ఏర్పాటు చేసింది.

నగదు రహిత లావదేవీలకు ఎలాంటి ప్రోత్సహకాలు ఇవ్వాలో ఈ కమిటీ సూచిస్తుందన్నారు. లావాదేవీల ఛార్జీలను అవసరమైతే ప్రభుత్వం పంచుకునే అవకాశం ఉందన్నారు. నల్లధనాన్ని నియంత్రించడానికి క్రెడిట్, డెబిట్ కార్డుల వినియోగాన్ని ప్రోత్సహిస్తామని కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రవేశ పెట్టిన బడ్జెట్లో పేర్కొన్న విషయం తెలిసిందే.
సాధ్యమైనంత వరకు నగదు లావాదేవీలన్నీ ఈ కార్డుల ద్వారానే జరిగేలా ప్రోత్సహిస్తామని చెప్పారు. దీంతో నల్లధనాన్ని కొంత వరకు తగ్గించవచ్చనే అభిప్రాయంతో కేంద్రం యోచిస్తోంది.
-
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారి బెంగళూరు-కడప-విజయవాడపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన -
కుప్పకూలిపోతున్న బంగారం ధరలు.. !! -
అన్నదాత సుఖీభవ డబ్బుల జమ.. అన్నీ శుభవార్తలు చెప్పిన సీఎం చంద్రబాబు












Click it and Unblock the Notifications