అమ్మ ఆరోగ్యం విషమించిందని పోస్టు! : మహిళపై కేసు, డీఎంకే నేతల అరెస్టు
చెన్నై : తమిళనాడు సీఎం జయలలిత ఆరోగ్య పరిస్థితుల మీద జరుగుతున్న వదంతుల ప్రచారం తీవ్ర గందరగోళానికి గురిచేస్తోంది. ఓవైపు జయలలిత ఫోటోలు విడుదల చేయాలని డీఎంకే అధ్యక్షుడు కరుణానిధి డిమాండ్ చేస్తుండగా.. మరోవైపు సోషల్ మీడియాలో కొంతమంది అనవసర గందరగోళానికి గురిచేసే ప్రయత్నాలు చేస్తున్నారు.
తాజాగా జయలలిత ఆరోగ్యం క్షీణిస్తోందంటూ ఓ ఫ్రాన్స్ మహిళ సోషల్ మీడియాలో పోస్టు పెట్టింది. ఇది కాస్త పోలీసుల దృష్టికి వెళ్లడంతో.. ఆమెపై కేసు నమోదు చేశారు పోలీసులు. అలాగే జయలలిత ఆరోగ్యంపై దుష్ప్రచారం చేస్తోన్న పదిమంది డీఎంకే కార్యకర్తలను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇదిలా ఉంటే.. జయ ఆరోగ్యంపై ఇప్పటివరకు అధికారిక ప్రకటనేది రాకపోవడంతో.. వదంతులు మరింత షికారు చేస్తున్నాయి.

కాగా, స్వల్ప అనారోగ్యం కారణంగా.. పదిరోజుల క్రితం చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చేరారు జయలలిత. రెండు రోజులుగా ఆమె ఆరోగ్య పరిస్థితిపై ఎలాంటి బులెటిన్ విడుదల చేయకపోవడంతో.. ఆమె ఆరోగ్యం విషమించిందంటూ దుష్ప్రచారం జరుగుతోంది. దీనిపై స్పందించిన ఏఐడీఎంకే నేతలు పుకార్లను నమ్మవద్దని ప్రకటన చేశారు. ప్రస్తుతం జయలలిత చికిత్స పొందుతోన్న అపోలో ఆసుపత్రి వద్ద భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.
-
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
బడ్జెట్ లో ఉద్యోగులు - మహిళలకు కొత్త వరాలు - పెన్షన్, 'కళ్యాణ లక్ష్మీ' పెంపు ఇలా..!! -
కేబినెట్ లోకి విజయశాంతి, పీసీసీ చీఫ్ మార్పు - ఆ ఇద్దరూ ఔట్..కొత్తగా..!! -
బెంగళూరులో రెండో భారీ ఎయిర్ పోర్ట్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
భారీగా పెరిగిన డీజిల్ ధరలు, తగ్గుతున్న నిల్వలు- కొత్త రేట్లు ఇలా..!! -
ఏమి సేతు రా: 2 గంటలు వెయిట్ చేస్తే గానీ అమిత్ షా దొరకలేదు












Click it and Unblock the Notifications