టీఎన్ నెంబర్ కనపడింది: దుమ్ములేపేశారు
బెంగళూరు: కావేరి జలాల వివాదంతో కర్ణాటక బంద్ కు పిలుపునిచ్చారు. బంద్ సందర్బంగా తమిళనాడుకు చెందిన పలు వాహనాలను ఆందోళనకారులు ధ్వంసం చేశారు. వాహనాల మీద టీఎన్ అని కనపడితే సహనం కొల్పోయారు.
బెంగళూరు నగరంలోని జయనగర 3వ బ్లాక్ లో ఓ ప్రార్థనా మందిరం ముందు తమిళనాడు రిజిస్ట్రేషన్ నెంబర్ ఉన్న కారు పార్క్ చేశారు. ర్యాలీగా వెలుతున్న కన్నడ సంఘాల నాయకులు, కార్య కర్తలు ఆ కారును గుర్తించారు.

సహనం కొల్పోయిన ఆందోళనకారులు కారును ధ్వంసం చేశారు. సిల్క్ బోర్డు జంక్షన్ దగ్గర తమిళనాడు వైపు వెలుతున్న ఐదుకార్లు, నాలుగు బైక్ లు ధ్వంసం చేశారు. ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలో రోడ్డు పక్కన నిలిపిన తమిళనాడు లారీల మీద రాళ్ల వర్షం కురిపించారు.

తమిళనాడు ప్రభుత్వానికి చెందిన బస్సులు ఇక్కడి శాంతినగర్ లో పార్క్ చేశారు. ఆ వాహనాలను ధ్వంసం చెయ్యడానికి ప్రయత్నించడంతో పోలీసులు ఆందోళనకారులను అడ్డుకున్నారు. తమిళనాడు బస్సులకు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.

తమిళనాడు రిజిస్ట్రేషన్ నెంబర్లు ఉన్న వాహనాలు రోడ్ల మీదకు తీసురాకూడదని తాము పదేపదే విజ్ఞప్తి చేసినా నిర్లక్షం చెయ్యడం వలనే ఇలా జరిగిందని పోలీసులు అంటున్నారు. మొత్తం మీద బంద్ లో పాల్గోన్న వారు ఎక్కడైనా టీఎన్ నెంబర్ వాహనాలు కనపడుతాయా అని పదేపదే పరిశీలించారు.












Click it and Unblock the Notifications