కావేరి: తీర్పు పరిశీలించాలని సుప్రీంలో కేంద్రం అర్జీ
న్యూఢిల్లీ: కావేరీ జలాల పంపిణి వివాదానికి సంబంధించి కావేరీ మేనేజ్ మెంట్ బోర్డును ఏర్పాటు చెయ్యడం సాధ్యం కాదని కేంద్ర ప్రభుత్వం సుప్రీం కోర్టులో అర్జీ సమర్పించింది. మీరు ఇచ్చిన తీర్పు పరిశీలించాలని కేంద్ర ప్రభుత్వం సుప్రీం కోర్టులో మనవి చేసింది.
కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో కర్ణాటక కొంత మేర ఊపిరిపీల్చుకుంది. కేంద్ర ప్రభుత్వం సమర్పించిన అర్జీని సుప్రీం కోర్టు మంగళవారం విచారించనుంది. అక్టోబర్ 4వ తేదీలోపు కావేరీ మేనేజ్ మెంట్ బోర్డును ఏర్పాటు చెయ్యాలని సుప్రీం కోర్టు కేంద్ర ప్రభుత్వానికి సూచించింది.

కావేరీ మేనేజ్ మెంట్ బోర్డు ఏర్పాటు చెయ్యడానికి తాము సిద్దంగా ఉన్నామని గత శుక్రవారం అటర్నరీ జనరల్ సుప్రీం కోర్టుకు చెప్పారు. కావేరీ మేనేజ్ మెంట్ బోర్డు ఏర్పాటు చెయ్యడం పార్లమెంట్ కు సంబంధించిన విషయం.
చట్టపరంగా కర్ణాటక శాసన సభ ఏకగ్రీవ తీర్మానాన్ని గౌరవించాలని, అందువలన తాము ఇంత త్వరగా కావేరీ మేనేజ్ మెంట్ బోర్డును ఏర్పాటు చెయ్యలేమని కేంద్ర ప్రభుత్వం సుప్రీం కోర్టులో అర్జీ సమర్పించింది.












Click it and Unblock the Notifications