కావేరి చిచ్చు: ఒకే కంపెనీ, 25 లారీలు బూడిద
బెంగళూరు: ప్రముఖ వ్యాపారవేత్త, సినీ నిర్మాత, డిష్టిబ్యూటర్ గోకుల్ రాజ్ కు కోలుకోలేని దెబ్బపడింది. గోకుల్ రాజ్ ట్రాన్స్ పోర్టుకు చెందిన 25 లారీలకు ఆందోళన కారులు నిప్పు పెట్టారు.
బెంగళూరులో స్థిరపడిన గోకుల్ రాజ్ (తమిళ వ్యక్తి) పలు వ్యాపారాలు చేస్తున్నారు. ఆయన ఎక్కువగా ట్రాన్స్ పోర్ట్, సినిమాల వ్యాపారం చేస్తున్నారు. కావేరీ జలాల వివాదం ముదరడంతో కన్నడిగులు గోకుల్ రాజ్ ట్రాన్స్ పోర్టు మీద కన్ను వేశారు.

గోకుల్ రాజ్ కు చెందిన 25 లారీలు, ట్రక్కులకు నిప్పంటించి నిరసన వ్యక్తం చేశారు. సౌత్ ఇండియా సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన కబాలి సినిమాను కర్ణాటకలో గోకుల్ రాజ్ ఫిలిమ్స్ విడుదల చేసింది.
గోకుల్ రాజ్ కంపెనీల అధికారులు తమ వాహనాలు ఎక్కడికక్కడ నిలిపివేయాలని సిబ్బందికి సూచించారు. బెంగళూరు నగర శివార్లలోని కంగేరీలో తమిళనాడు ఆర్ టీసీ బస్సులకు ఆందోళనకారులు నిప్పంటించి భూడిద చేశారు.












Click it and Unblock the Notifications