విజయ్ మాల్యా, లలిత్ మోడీల గురించి లెక్క చెప్పం: సీబీఐ
న్యూఢిల్లీ: విదేశాలకు పారిపోయిన విజయ్ మాల్యా, లలిత్ మోడీలను వెనక్కి తీసుకు వచ్చేందుకు పెడుతున్న ఖర్చు గురించి తాము వెల్లడించలేమని కేంద్ర దర్యాఫ్తు సంస్థ సీబీఐ తెలిపింది. పుణేకు చెందిన సామాజిక కార్యకర్త విహార్ ధ్రువే అనే వ్యక్తి ఆర్టీఐ కింద ఈ మేరకు దరఖాస్తు చేసుకున్నారు.
మాల్యా, లలిత్ మోడీలను వెనక్కి తీసుకు వచ్చేందుకు పెడుతున్న ఖర్చు వివరాలు కావాలని అడిగారు. ఆర్టీఐ చట్టంలోని నిబంధనల ప్రకారం ఇలాంటి విషయాలు వెల్లడించాల్సిన అవసరం లేకుండా మినహాయింపు ఉందని సీబీఐ తెలిపింది.

ఆర్టీఐ చట్టంలోని సెక్షన్ 24 ప్రకారం కొన్ని సంస్థలకు నిబంధనల నుంచి మినహాయింపు ఉందని స్పష్టం చేసింది. మాల్యా రూ.9వేల కోట్ల మేర బ్యాంకులకు చెల్లించకుండా లండన్ పారిపోయిన విషయం తెలిసిందే. లలిత్ మోడీ కూడా మనీలాండరింగ్ కేసు ఎదుర్కొంటున్నారు.
More From
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..!












Click it and Unblock the Notifications