విజయ్ మాల్యా, లలిత్ మోడీల గురించి లెక్క చెప్పం: సీబీఐ
న్యూఢిల్లీ: విదేశాలకు పారిపోయిన విజయ్ మాల్యా, లలిత్ మోడీలను వెనక్కి తీసుకు వచ్చేందుకు పెడుతున్న ఖర్చు గురించి తాము వెల్లడించలేమని కేంద్ర దర్యాఫ్తు సంస్థ సీబీఐ తెలిపింది. పుణేకు చెందిన సామాజిక కార్యకర్త విహార్ ధ్రువే అనే వ్యక్తి ఆర్టీఐ కింద ఈ మేరకు దరఖాస్తు చేసుకున్నారు.
మాల్యా, లలిత్ మోడీలను వెనక్కి తీసుకు వచ్చేందుకు పెడుతున్న ఖర్చు వివరాలు కావాలని అడిగారు. ఆర్టీఐ చట్టంలోని నిబంధనల ప్రకారం ఇలాంటి విషయాలు వెల్లడించాల్సిన అవసరం లేకుండా మినహాయింపు ఉందని సీబీఐ తెలిపింది.

ఆర్టీఐ చట్టంలోని సెక్షన్ 24 ప్రకారం కొన్ని సంస్థలకు నిబంధనల నుంచి మినహాయింపు ఉందని స్పష్టం చేసింది. మాల్యా రూ.9వేల కోట్ల మేర బ్యాంకులకు చెల్లించకుండా లండన్ పారిపోయిన విషయం తెలిసిందే. లలిత్ మోడీ కూడా మనీలాండరింగ్ కేసు ఎదుర్కొంటున్నారు.












Click it and Unblock the Notifications