Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

రూ.50 లక్షలు వరకు సర్కారు ఆర్ధికసాయం.. మీకు కావాలా ??

దేశంలో వేగంగా తగ్గిపోతున్న గాడిదల సంఖ్యను పెంచి, స్వదేశీ జాతులను సంరక్షించేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. National Livestock Mission (NLM) పథకం కింద గాడిదల పెంపకానికి గరిష్టంగా రూ.50 లక్షల వరకు సబ్సిడీ అందిస్తోంది. ఈ పథకం ద్వారా గాడిదలు మాత్రమే కాకుండా గుర్రాలు, ఒంటెల పెంపకాన్ని కూడా ప్రోత్సహిస్తున్నారు.

దేశంలో తగ్గిన గాడిదల సంఖ్య..?

2012తో పోలిస్తే దేశంలో గాడిదల సంఖ్య సుమారు 60 శాతం తగ్గిపోయింది. 2019 పశుగణన లెక్కల ప్రకారం కేవలం 1.23 లక్షల గాడిదలు మాత్రమే మిగిలి ఉన్నాయి. గతంలో నిర్మాణ పనులు, బరువులు మోయడం వంటి పనుల్లో విస్తృతంగా ఉపయోగించిన గాడిదలు, ఆధునిక యంత్రాల రాకతో ప్రాధాన్యత కోల్పోయాయి. దాంతో పెంపకం తగ్గి జాతి అంతరించిపోతుందనే స్థితి ఏర్పడింది.

central-goverment-scheme-that-national-livestock-mission-provides-up-to-50-lakh-for-donkey-rearing

NLM పథకం లక్ష్యాలు

2014-15లో ప్రారంభమైన ఈ పథకం 2021-22 నుంచి మరింత బలోపేతం చేయబడింది. ముఖ్య ఉద్దేశ్యాలు:

  • స్వదేశీ జంతు జాతుల సంరక్షణ

  • గ్రామీణ ఉపాధి అవకాశాల సృష్టి

  • పాలు, మాంసం, ఉన్ని ఉత్పత్తి పెంపు

  • పశుగ్రాస ఉత్పత్తి అభివృద్ధి

  • పశుసంవర్థక రంగంలో వ్యవస్థీకృత వ్యాపారాల ప్రోత్సాహం

    ఎవరు దరఖాస్తు చేయవచ్చు?

    ఈ పథకం కింద క్రింది వర్గాలు దరఖాస్తు చేసుకోవచ్చు:

    • వ్యక్తిగత రైతులు

    • FPOలు (ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్)

    • SHGలు (స్వయంసహాయక సమూహాలు)

    • JLGలు (జాయింట్ లైబిలిటీ గ్రూపులు)

    • FCOలు

    • సెక్షన్ 8 కంపెనీలు

      ప్రాజెక్ట్ వ్యయంలో 50 శాతం వరకు, గరిష్టంగా రూ.50 లక్షల సబ్సిడీ లభిస్తుంది. ఉదాహరణకు, రూ.1 కోటి ప్రాజెక్ట్‌కు రూ.50 లక్షలు కేంద్రం నుంచి అందుతాయి.

      యూనిట్ ప్రమాణాలు..

      గాడిదల పెంపకం యూనిట్‌కు కనీస ప్రమాణాలు:

      • కనీసం 50 ఆడ గాడిదలు

      • 5 మగ గాడిదలు

        గుర్రాల కోసం:

        • 10 ఆడ గుర్రాలు

        • 2 మగ గుర్రాలు

          ఒంటెల పెంపకానికి యూనిట్ పరిమాణాన్ని బట్టి రూ.3 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు సబ్సిడీ లభిస్తుంది. ముఖ్యంగా సబ్సిడీ స్వదేశీ జాతులకు మాత్రమే వర్తిస్తుంది.

          బ్రీడింగ్ సెంటర్లకు భారీ నిధులు..

          అలానే జాతి సంరక్షణలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా కేంద్రం సహకరిస్తోంది. గాడిదలు, గుర్రాలు, ఒంటెల కోసం వీర్య కేంద్రాలు లేదా న్యూక్లియస్ బ్రీడింగ్ ఫారమ్‌లు ఏర్పాటు చేయడానికి రూ.10 కోట్ల వరకు ఆర్థిక సహాయం అందిస్తుంది. దీని ద్వారా శాస్త్రీయ పద్ధతుల్లో జాతి అభివృద్ధి సాధ్యమవుతుంది.

          గాడిద పాలకు పెరుగుతున్న డిమాండ్

          ఇటీవల గాడిద పాలు ఆరోగ్యపరంగా ప్రయోజనకరమనే ప్రచారం పెరుగుతోంది. కొన్ని సంస్థలు Food Safety and Standards Authority of India (FSSAI)ను గాడిద పాలను ఆహార ఉత్పత్తుల జాబితాలో చేర్చాలని కోరాయి. ప్రముఖ యోగా గురువు Baba Ramdev కూడా గాడిద పాల ప్రయోజనాలను ప్రస్తావించడం ఈ రంగంపై మరింత దృష్టిని తీసుకువచ్చింది. కాస్మెటిక్స్, ఔషధ ఉత్పత్తుల్లో కూడా గాడిద పాల వినియోగంపై పరిశోధనలు జరుగుతున్నాయి. దీంతో భవిష్యత్తులో ఈ రంగం లాభదాయక వ్యాపారంగా మారే అవకాశముంది.

          ఏ రాష్ట్రాల్లో ఎక్కువగా ఉన్నాయి?

          రాజస్థాన్, మహారాష్ట్ర, ఉత్తర ప్రదేశ్, గుజరాత్, బీహార్, జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో గాడిదలు ఎక్కువగా కనిపిస్తాయి. అయితే దేశంలోని 28 రాష్ట్రాల్లో మాత్రమే గాడిదలు ఉన్నాయని, చాలాచోట్ల సంఖ్య 2 నుంచి 10 మధ్యకే పరిమితమైందని నివేదికలు చెబుతున్నాయి. ఇది జాతి సంరక్షణ అవసరాన్ని మరింత స్పష్టంగా చూపిస్తోంది.

          సబ్సిడీ విడుదల విధానం

          సబ్సిడీ మొత్తాన్ని బ్యాంకు రుణం ఆమోదం తర్వాత రెండు విడతలుగా నేరుగా ప్రభుత్వం విడుదల చేస్తుంది. ముందుగా బ్యాంకు ద్వారా ప్రాజెక్ట్ ఆమోదం పొందాలి. తర్వాత పర్యవేక్షణ అనంతరం సబ్సిడీ జమ చేయబడుతుంది.

          ఎలా దరఖాస్తు చేయాలి?

          అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ nlm.udyamimitra.in ను సందర్శించి:

          • ప్రాజెక్ట్ రిపోర్ట్ సిద్ధం చేయాలి

          • అవసరమైన పత్రాలు అప్‌లోడ్ చేయాలి

          • బ్యాంకు లింకేజ్ ప్రక్రియ పూర్తి చేయాలి

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+