వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ముడి జూట్ ఎంఎస్పీని రూ. 300 పెంచిన కేంద్రం: క్వింటాల్‌కు రూ. 5,050

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. 2023-24 సీజన్లో ముడి జనపనారా(raw jute) కనీస మద్దతు ధరను క్వింటాల్‌కు రూ. 300 పెంచింది. దీంతో క్వింటాల్ ధర రూ. 5050కి పెరిగింది. ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ(సీసీఈఏ) సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.

వ్యవసాయ ఖర్చులు, ధరల కమిషన్(సీఏసీపీ) సిపార్సుల ఆధారంగా ఆమోదం లభించిందని ఐ అండ్ బీ మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు. 20234-24 సీజన్లో ముడి జనపనార(టీడీ-3 మునుపటి టీడీ-5 గ్రేడ్‌కి సమానం) ఎంఎస్పీ క్వింటాలుకు రూ. 5050గా నిర్ణయించారు.

 Central govt hikes raw jute MSP by Rs 300 to Rs 5,050 per quintal

ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం తీపి కబురు: 4 శాతం డీఏ పెంపు

ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం తాజాగా తీపి కబురు అందించింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులందరికీ 4 శాతం కరవు భత్యం(డీఏ) పెంచుతున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు శుక్రవారం జరిగిన కేబినెట్ ఆమోదం తెలిపింది. దీంతో ప్రస్తుతం 38 శాతంగా ఉన్న డీఏ 42 శాతానికి పెరగనుంది.

తాజా పెంపుతో కేంద్ర ప్రభుత్వ ఖజానాపై అదనంగా రూ. 12,815 కోట్ల భారం పడనుందని కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు. జనవరి 1, 2023 నుంచి ఈ పెంపు వర్తిస్తుందని ఆయన తెలిపారు. ఈ పెంపుతో పెన్షన్లకు కూడా లబ్ధి చేకూరనుంది. కాగా, పెరుగుతున్న ధరలను భర్తీ చేయడానికి, ప్రభుత్వం తన ఉద్యోగులకు డీఏ, సీనియర్లకు డియర్నెస్ రిలీఫ్ అందిస్తుంది. ఇది పారిశ్రామిక కార్మికులు లేదా CPI-IW కోసం ఇటీవలి వినియోగదారుల ధరల సూచికపై ఆధారపడి ఉంటుంది.

"... దాదాపు 47.58 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 69.76 లక్షల మంది పెన్షనర్లు దీని ద్వారా ప్రయోజనం పొందుతారు. 7వ కేంద్ర వేతన సంఘం సిఫార్సుల ఆధారంగా ఆమోదించిబడిన ఫార్ములా ప్రకారం ఈ పెంపుదల ఉంది' అని ప్రభుత్వ ప్రకటనలో పేర్కొంది.

కేంద్రం చివరిసారిగా జూలై 1, 2022 నుంచి రెట్రోయాక్టివ్ ఎఫెక్ట్‌తో సెప్టెంబర్ 2022లో డీఏను సవరించింది. ఆ సమయంలో కూడా ఇది 4 శాతం పెంచి, మొత్తం 38 శాతానికి పెంచబడింది. డీఏ కనీసం సంవత్సరానికి రెండుసార్లు నవీకరిస్తారు.

ఎల్పీజీ సిలిండర్‌పై ప్రభుత్వం రూ. 200 సబ్సిడీని పొడిగించింది.
అంతర్జాతీయ మార్కెట్‌లో పెరుగుతున్న పెట్రోలియం ధరలకు ప్రతిస్పందనగా.. ఎల్పీజీ సిలిండర్‌పై ప్రధాన మంత్రి ఉజ్వల యోజన (PMUY) సబ్సిడీని రూ. 200 చొప్పున ప్రభుత్వం శుక్రవారం ఒక సంవత్సరం పొడిగించింది. ఈ మార్పు 9.6 మిలియన్ కుటుంబాలకు ప్రయోజనం చేకూరుస్తుంది. పీఎంయూవై లబ్ధిదారులకు సంవత్సరానికి 12 రీఫిల్‌ల వరకు 14.2 కిలోల సిలిండర్‌పై రూ. 200 సబ్సిడీని ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ ఆమోదించింది.

English summary
Central govt hikes raw jute MSP by Rs 300 to Rs 5,050 per quintal.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X