ట్రిపుల్ తలాక్పై సుప్రీం తీర్పు: రాష్ట్రాలకు కేంద్రం ఆదేశాలు
న్యూఢిల్లీ: ట్రిపుల్ తలాక్ విధానాన్ని రద్దుచేస్తూ అత్యున్నత న్యాయస్థానం తీర్పు ఇచ్చిన కొద్ది గంటల్లోనే ఆ తీర్పు అమలుకు కేంద్ర ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తోంది. ఈ మేరకు నేడో, రేపో ఆదేశాలు జారీచేయనున్నట్టు ప్రకటించింది.
ట్రిపుల్ తలాక్ విధానాన్ని రద్దు చేస్తూ అత్యున్నత న్యాయస్థానం తీర్పు ఇచ్చిన కొద్ది గంటల్లోనే.... ఆ తీర్పును అమలు చేసేందుకు కేంద్రం వడివడిగా అడుగులు వేస్తోంది. ట్రిపుల్ తలాక్పై సుప్రీం ఉత్తర్వులు నిజమైన అర్ధంలో అమలుపర్చాలని రాష్ట్రాలకు కేంద్రం లేఖలు రాయనున్నట్టు ప్రభుత్వవర్గాలు మంగళవారం తెలిపాయి.
ట్రిపుల్ తలాక్ మతపరమైన అంశంతో ముడిపడి ఉన్నందున కోర్టు ఉత్తర్వుల అమలుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం మంగళవారం ఇచ్చిన తీర్పులో ట్రిపుల్ తలాక్ను రద్దుచేసింది.
దీనిని చారిత్రాత్మకమైన తీర్పుగా అభివర్ణించించారు మోడీ. అమలుకు సంబంధించిన నిర్ణయాలను వేగంగా తీసుకొంటుంది.