కేంద్రం సంచలన నిర్ణయం, అగ్రకుల పేదలకు 10% రిజర్వేషన్లు! కేబినెట్ ఆమోదం
న్యూఢిల్లీ: నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఆర్థికంగా వెనుకబడిన అగ్రకులాలకు పది శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని కేంద్ర కేబినెట్ నిర్ణయించింది. 10 శాతం రిజర్వేషన్ల పెంపుకు కేంద్ర కేబినెట్ సోమవారం నాడు ఆమోదం తెలిపింది.

విద్య, ఉద్యోగాలలో ఆర్థికంగా వెనుకబడిన కులాలకు పది శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని భావిస్తోంది. ఇందుకోసం కేంద్రం రాజ్యాంగ సవరణ చేయనుంది. ఈ నేపథ్యంలో రిజర్వేషన్లను 50 శాతం నుంచి 60 శాతానికి పెంచుతూ కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. అగ్రకుల పేదలకు రిజర్వేషన్ సౌకర్యం కల్పించనుంది.
రేపు (మంగళవారం) లోకసభలో అగ్రవర్ణాల రిజర్వేషన్ల బిల్లును కేంద్రం ప్రవేశపెట్టనుంది. ఏడాదికి రూ.8 లక్షల ఆదాయం కంటే తక్కువ ఉన్న వారు దీనికి అర్హులు. అలాగే, ఐదు ఎకరాల కంటే తక్కువ పొలం ఉన్న వారు రిజర్వేషన్లకు అర్హులు. వెయ్యి చదరపు అడుగుల ఇంటిస్థలం ఉంటే రిజర్వేషన్లకు అనర్హులు.
-
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా?












Click it and Unblock the Notifications