నీరవ్ మోడీ కేసులో తప్పుడు నిర్ణయం ఈడీ డైరెక్టర్పై వేటు వేసిన కేంద్రం
ఢిల్లీ : ఆర్థిక నేరస్థులైన నీరవ్ మోడీ, విజయ్ మాల్యా కేసు విచారణాధికారి బదిలీ విషయంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ వినీత్ అగర్వాల్ చిక్కుల్లో పడ్డారు. తప్పుడు నిర్ణయం తీసుకున్నారంటూ ఆయనపై కేంద్రం బదిలీ వేటు వేసింది. ఈ మేరకు ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
మార్చి 29న లండన్ కోర్టులో నీరవ్ మోడీ కేసు విచారణ జరిగింది. కేసుకు సంబంధించి ఈడీ తరఫున జాయింట్ డైరెక్టర్ సత్యబ్రత కుమార్ విచారణకు హాజరయ్యారు. ఆ సమయంలో ఆయనను ఆకస్మికంగా ట్రాన్స్ఫర్ చేస్తూ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ వినీత్ అగర్వార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నిర్ణయాన్ని తప్పుబట్టిన కేంద్రం వినీత్పై బదిలీ వేటు వేసింది. అతన్ని తన కేడర్కు తిప్పి పంపింది.

1994 ఐపీఎస్ బ్యాచ్కు చెందిన వినీత్ అగర్వాల్ మహారాష్ట్ర కేడర్ అధికారి. 2017లో ఆయనను ఎన్ఫోర్స్మెంట్ స్పెషల్ డైరెక్టర్గా నియమించారు. ఆయన ఐదేళ్ల పాటు పదవిలో కొనసాగాల్సి ఉండగా.. నీరవ్ మోడీ కేసు విషయంలో తీసుకున్న తప్పుడు నిర్ణయంతో కేంద్రం బదిలీ వేటు వేసింది.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications