మా వల్లే ఓ చాయ్వాలా నరేంద్ర మోడీ ప్రధాని అయ్యారు: మల్లికార్జున ఖర్గే
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యాన్ని కాపాడటం వల్లే ఓ చాయ్వాలా దేశానికి ప్రధానమంత్రి అయ్యారని ఆ పార్టీ నేత మల్లికార్జున ఖర్గే అన్నారు. దశాబ్దాల పాటు తమ పార్టీ దేశంలో ప్రజాస్వామ్యాన్ని రక్షించడం వల్లే నరేంద్ర మోడీ ప్రధాని అయ్యారని గుర్తుంచుకోవాలన్నారు.
43 సంవత్సరాల నాటి అత్యయికస్థితి రోజులను గుర్తు చేస్తున్న బీజేపీ నేతలు, గత నాలుగేళ్లుగా దేశంలో కొనసాగుతున్న అప్రకటిత ఎమర్జెన్సీ గురించి ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. గత 70 ఏళ్లలో కాంగ్రెస్ ఏం చేసిందని నరేంద్ర మోడీ ప్రశ్నించడం విడ్డూరంగా ఉందన్నారు.

కాంగ్రెస్ పార్టీ పాలన కొనసాగబట్టే ఈ రోజు ఓ చాయ్వాలా ప్రధానమంత్రిఅయ్యారని చెప్పారు. మేము ప్రజాస్వామ్యాన్ని అంతలా కాపాడామని చెప్పారు. మోడీ నేతృత్వంలోని ఎన్డీయే పాలన ప్రారంభమైన తర్వాత రైతుల ఆత్మహత్యలు పెరుగుతున్నాయన్నారు.
రైతులకు కొత్త రుణాలు రావడం లేదని మండిపడ్డారు. పలు సంక్షేమ పథకాలు ఆగిపోయాయన్నారు. నోట్ల రద్దు వల్ల ప్రజలకు ఏర్పడిన ఇబ్బందులను కూడా గుర్తు చేశారు. బీజేపీ ఉద్దేశ్యపూర్వకంగా ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ, సోనియా గాంధీ వ్యక్తిత్వాలపై దాడి చేస్తోందన్నారు. కాంగ్రెస్ ఓ కుటుంబం వంటిదన్నారు. తామంతా అందులో సభ్యులం అన్నారు.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!!











Click it and Unblock the Notifications