హర్యానా గవర్నర్గా దత్తాత్రేయ ప్రమాణం: స్వాగతం పలికిన సీఎం మనోహర్
ఛండీగఢ్: హర్యానా రాష్ట్ర గవర్నర్గా బండారు దత్తాత్రేయ గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. చండీగఢ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆయనతో ప్రమాణం చేయించారు. చండీగఢ్లోని రాజ్భవన్లో గవర్నర్గా దత్తాత్రేయ బాధ్యతలు స్వీకరించారు.
ఇది వరకు హిమాచల్ప్రదేశ్ గవర్నర్గా పనిచేసిన దత్తాత్రేయ ఇటీవల హర్యానాకు బదిలీ అయిన విషయం తెలిసిందే. చండీగఢ్లో జరిగిన బండారు దత్తాత్రేయ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ కట్టర్, డిప్యూటీ సీఎం దుష్యంత్ చౌతాలా హాజరయ్యారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిగా బండారు దత్తాత్రేయ గతంలో పనిచేశారు. 1991, 98, 99, 2014లో సికింద్రాబాద్ లోక్సభ స్థానం నుంచి బీజేపీ తరపున పోటీచేసి గెలుపొందారు. అటల్ బిహారీ వాజపేయి హయాంలో రైల్వే మంత్రిగా, నరేంద్ర మోడీ ప్రభుత్వంలో కేంద్ర కార్మిక శాఖ సహాయ మంత్రిగా పనిచేశారు.
Former Himachal Pradesh Governor Bandaru Dattatreya takes oath as Governor of Haryana in Chandigarh pic.twitter.com/krRgfGBDxg
— ANI (@ANI) July 15, 2021
2019లో
కేంద్ర
ప్రభుత్వం
దత్తాత్రేయను
హిమాచల్
ప్రదేశ్
గవర్నర్గా
నియమించింది.
దత్తాత్రేయ
హిమాచల్
ప్రదేశ్
నుంచి
హర్యానాకు
బదిలీ
కావడంతో..
హిమాచల్
ప్రదేశ్
గవర్నర్గా
రాజేంద్ర
అర్లేకర్
బాధత్యలు
చేపట్టారు.
Recommended Video
हरियाणा के नव नियुक्त राज्यपाल श्री @Dattatreya जी का शपथ ग्रहण समारोह। https://t.co/eBfINeKLpo
— CMO Haryana (@cmohry) July 15, 2021
ఇటీవల కేంద్ర ప్రభుత్వం మొత్తం 8 రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమించింది. మరోవైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన బీజేపీ నేత, మాజీ ఎంపీ కంభంపాటి హరిబాబుకు గవర్నర్ పదవి వరించింది. ఆయన మిచోరం గవర్నర్గా నియమితులయ్యారు.