Chemistry Nobel 2023 : ముగ్గురికి కెమిస్ట్రీ నోబెల్ పురస్కారం-క్వాంటమ్ డాట్స్ ఆవిష్కరణ, ప్రయోగాలకు..
ప్రపంచ వ్యాప్తంగా మానవాళి కోసం చేసే పరిశోధనలకు ఏటా ప్రకటించే అత్యున్నత నోబెల్ పురస్కారాల ప్రకటన కొనసాగుతోంది. ఇందులో భాగంగా ఇవాళ రసాయన శాస్త్రంలో నోబెల్ బహుమతిని ప్రకటించారు. రసాయన శాస్త్రంలో చేసిన ప్రయోగాలకు గానూ ముగ్గురు శాస్త్రవేత్తలకు ఈ ఏడాది కెమిస్ట్రీ నోబెల్ బహుమతిని ప్రకటిస్తూ రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ఇవాళ ఓ ప్రకటన చేసింది.

క్వాంటం చుక్కల ఆవిష్కరణ, సంశ్లేషణకు గాను 2023 ఏడాదికి రసాయన శాస్త్రంలో నోబెల్ బహుమతిని ముగ్గురు శాస్త్రవేత్తలకు సంయుక్తంగా ప్రకటించారు. ఇందులో మౌంగీ బవేండీ, లూయిస్ బ్రూస్, అలెక్సీ ఎకిమోవ్ ఉన్నారు. 2023 ఏడాది రసాయన శాస్త్రంలో నోబెల్ బహుమతి క్వాంటం డాట్స్, నానోపార్టికల్స్ యొక్క ఆవిష్కరణ, అభివృద్ధికి గుర్తింపుగా ప్రదానం చేస్తున్నట్లు కమిటీ ప్రకటించింది.
BREAKING NEWS
— The Nobel Prize (@NobelPrize) October 4, 2023
The Royal Swedish Academy of Sciences has decided to award the 2023 #NobelPrize in Chemistry to Moungi G. Bawendi, Louis E. Brus and Alexei I. Ekimov “for the discovery and synthesis of quantum dots.” pic.twitter.com/qJCXc72Dj8
క్వాంటం కణాలు ప్రత్యేకమైన లక్షణాలు కలిగి ఉంటాయని, ఇప్పుడు టెలివిజన్ స్క్రీన్లు, ఎల్ఈడీ లైట్ల నుండి వాటి కాంతిని వ్యాప్తి చేస్తాయని కమిటీ తెలిపింది. అవి రసాయన ప్రతిచర్యలను ఉత్ప్రేరకపరుస్తాయని, వాటి స్పష్టమైన కాంతి సర్జన్ కోసం కణితి కణజాలాన్ని ప్రకాశవంతం చేస్తుందన్నారు. మరోవైపు రసాయన శాస్త్రంలో ఈసారి ప్రకటించే నోబెల్ విజేతల పేర్లు ముందుగానే లీక్ అయ్యాయి. అయితే విజేతలలో ఒకరైన మూంగి బావెండితో విలేకరులు మాట్లాడినప్పుడు, లీక్ గురించి తనకు తెలియదని అన్నారు. రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ నుండి వచ్చిన పిలుపుతో తాను స్పందించినట్లు తెలిపారు.
-
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?











Click it and Unblock the Notifications