Coronavirus: కరోనా హాట్ స్పాట్ కోయంబేడు మార్కెట్ క్లోజ్, ఒక్క దెబ్బకు వందల మందికి, పాపం!
చెన్నై: దేశవ్యాప్తంగా కరోనా వైరస్ (COVID 19) కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. కరోనా వైరస్ కట్టడికి లాక్ డౌన్ అమలు చేసినా ఏదో ఒక విధంగా కరోనా వ్యాధి ప్రజలకు వ్యాపిస్తోంది. తమిళనాడులో 3, 550 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదైనాయి. చెన్నైలోని కోయంబేడు మార్కెట్ కరోనా వైరస్ కు హాట్ స్పాట్ గా మారింది. చెన్నైలోని ఇప్పటి వరకు మొత్తం 1, 724 కరోనా పాజిటివ్ కేసులు నిర్దరాణ అయ్యాయి.
చెన్నై సిటీలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు రోజురోజుకు పెరిగిపోవడంతో కోయంబేడు మార్కెట్ ను అధికారులు మూసివేశారు. కోయంబేడు మార్కెట్ కు తమిళనాడులోని పలు జిల్లాల ప్రజలతో పాటు ఇతర రాష్ట్రాల ప్రజలు ఎవ్వరూ రాకుండా అధికారులు ఆంక్షలు విధించారు. కోయంబేడు మార్కెట్ కారణంగా వంద మందికిపైగా కరోనా వైరస్ వ్యాపించిందని అధికారులు అంటున్నారు.

చెన్నై కోయంబేడు మార్కెట్
తమిళనాడు రాజధాని చెన్నై సిటీలోని కోయంబేడు మార్కెట్ లో కొన్ని వేల దుకాణాలు ఉన్నాయి. ప్రతిరోజు తమిళనాడులోని ఇతర జిల్లాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి కోయంబేడు మార్కెట్ కు వ్యాపారులు వస్తుంటారు. కోయంబేడు మార్కెట్ విషయంలో అధికారులు కొంచెం నిర్లక్షం చెయ్యడంతో ఇప్పుడు కరోనా విషయంలో మొదటికే మోసం వచ్చిందని తమిళనాడు ప్రభుత్వం విచారణలో వెలుగు చూసింది.

కరోనా హాట్ స్పాట్ కోయంబేడు మార్కెట్
కోయంబేడు మార్కెట్ కరోనా వైరస్ కు హాట్ స్పాట్ అయ్యిందని ప్రభుత్వం గుర్తించింది. కోయంబేడు మార్కెట్ లో కేవలం 200 హోల్ సేల్ వ్యాపారస్తులు మాత్రమే వ్యాపారం చెయ్యడానికి అనుమతి ఇచ్చిన ప్రభుత్వం ఆ మార్కెట్ అన్ని ప్రవేశ ద్వారాలు మూసివేయాలని ఆదేశాలు జారీ చేసింది. కోయంబేడు మార్కెట్ ను తాత్కాలికంగా తిరుమలైసాయి ప్రాంతానికి తరలించారు.

కరోనా వైరస్ చైన్ లింక్
కోయంబేడు మార్కెట్ లో వ్యాపారం చెయ్యడానికి వచ్చిన వారిలో ఒకరి నుంచి మరోకరికి కరోనా వైరస్ వ్యాపించిందని అధికారులు గుర్తించారు. కోయంబేడు మార్కెట్ కారణంగా చెన్నై జిల్లాలో 102, అరియలూరులో 22, విళపురంలో 58, కాంచీపురంలో 7, కడలూరులో 26, పెరంబూరులో ఒకరికి కరోనా వైరస్ వ్యాపించిందని అధికారుల విచారణలో వెలుగు చూసింది.

ఒక్క దెబ్బకు 119 మందికి కరోనా
చెన్నైలోని కోయంబేడు మార్కెట్ కారణంగా ఇప్పటి వరకు 119 మందికి కరోనా పాజిటివ్ వచ్చిందని నిర్దారణ అయ్యింది. అదే విదంగా మరో 550 మందికి కరోనా పరీక్షలు నిర్వహించామని, వాటి ఫలితాల కోసం ఎదురు చూస్తున్నామని వైద్యశాఖ అధికారులు అంటున్నారు.

ఒక్కరోజులో 527 కరోనా పాజిటివ్
తమిళనాడులో ఒక్క సోమవారం మాత్రమే 527 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడంతో అక్కడి ప్రభుత్వం హడలిపోయింది. సోమవారం ఒక్కరోజు దెబ్బతో తమిళనాడులో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3, 550కి పెరిగిపోయింది. చెన్నైలో బయటపడిన 266 కరోనా పాజిటివ్ కేసుల్లో ఎక్కువ శాతం కోయంబేడు మార్కెట్ నుంచి వ్యాపించాయని అధికారుల విచారణలో వెలుగు చూసింది. కరోనా వైరస్ కు హాట్ స్పాట్ అయిన కోయంబేడు మార్కెట్ ను అధికారులు తాత్కాలికంగా మూసివేశారు.
-
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా?












Click it and Unblock the Notifications