cheating: రూ. 56 కోట్ల చీటింగ్ కేసు, ఆంధ్రా బార్డర్ లో అదృష్టం దరిధ్రం పట్టినట్లు పట్టింది !
ప్రజల నుంచి వందల కోట్ల రూపాయలు డబ్బులు తీసుకుని జెండా ఎత్తేశారు. నిందితులకు ఆంధ్రా బార్డర్ లో అదృష్టం దరిధ్రం పట్టినట్లు పట్టింది.
చెన్నై: అమాయకులు, బ్లాక్ మనీ ఉన్న వాళ్లను టార్గెట్ చేసుకున్న కొందరు ఓ కంపెనీ ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్-తమిళనాడు బార్డర్ లో హెడ్ ఆఫీస్ పెట్టారు. రాష్ట్ర రాజధానిలో బ్రాంచ్ లు పెట్టారు. అధిక మొత్తంలో వడ్డీ ఇస్తామని ప్రజలకు మాయమాటలు చెప్పారు. వందల మంది అమాయకుల నుంచి కోట్ల రూపాయలు తీసుకుని చాలా కాలం పాటు అధిక వడ్డీ ఇచ్చారు. చివరికి మనోళ్ల అసలు స్వరూపం చూపించారు. ఒక కోటి కాదు రెండు కోట్లు కాదు భారీ మొత్తంలో ప్రజల నుంచి కోట్ల రూపాయలు డబ్బులు తీసుకుని జెండా ఎత్తేసిన బోగస్ కంపెనీ నిర్వహకులు చివరికి కోర్టు విచారణకు కూడా హాజరుకాకుండా తప్పించుకోవడంతో వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. నిందితులకు ఆంధ్రా బార్డర్ లో అదృష్టం దరిధ్రం పట్టినట్లు పట్టింది.

రూ. 56 కోట్ల చీటింగ్ కేసులో ?
అధిక వడ్డీ ఇస్తామని చెప్పి రూ. 56 కోట్ల 82 లక్షల రూపాయల మోసం చేసిన కేసులో తమిళనాడుకు చెందిన ఐఎఫ్ఎస్ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్, ఎగ్జిక్యూటివ్లతో సహా మొత్తం 10 మందిపై అరెస్టు వారెంట్ జారీ అయ్యింది. చెన్నైలోని ఆర్థిక మోసాల కేసులు విచారణ చేస్తున్న ప్రత్యేక కోర్టును నిందితులను అరెస్టు చెయ్యాలని అరెస్టు వారెంట్లు జారీ చేసి వాళ్లు ఎక్కడ ఉన్నా అరెస్టు చెయ్యాలని పోలీసు అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.

ఆంధ్రా బార్డర్ లో హెడ్ ఆఫీస్
ఐఎప్ సీ కంపెనీ వేలూరు జిల్లాలోని (ఆంధ్రప్రదేశ్-తమిళనాడు బార్డర్)లోని గుడిపడిలో ప్రధాన కార్యాలయం ఏర్పాటు చేశారు. మాది అంతర్జాతీయ ఆర్థిక సేవలు అందించే కంపెనీ అని ప్రచారం చేశారు. మీరు ఎంత పెట్టుబడి పెడితే అంత డబ్బులకు 10 నుంచి 25 శాతం నెలవారీ వడ్డీ ఇస్తానని ఆ కంపెనీ భారీ ఎత్తున ప్రచారం చేసింది.

200 మంది అమాయకులకు టోపీ
ఈ విధంగా ఆ కంపెనీ రూ. 56 కోట్ల రూపాయల వరకు డిపాజిట్ల రూపంలో డబ్బులు వసూలు చేసి బోర్డు తిప్పేశారు. దీనికి సంబంధించి 200 మంది ఇన్వెస్టర్లు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఐఎఫ్ఎస్ మార్క్ ఆపర్చునిటీ డెవలప్మెంట్ లిమిటెడ్ కంపెనీతో పాటు ఆరు కంపెనీల డైరెక్టర్లు, ఎగ్జిక్యూటివ్లు, ఉద్యోగులపై ఆర్థిక నేరాల విభాగం పోలీసులు రూ, 56,82,89,879,000 రూపాయలను మోసం చేసినందుకు కేసులు నమోదు అయ్యాయి.

మోహన్ బాబు అండ్ కో ఎక్కడ ?
ఈ కేసుకు సంబంధించి కంపెనీ డైరెక్టర్ మోహన్బాబు, కంపెనీ పదాధికారులు శరవణకుమార్, గుప్పురాజ్, జగన్నాథన్ సహా మొత్తం 13 మందిని ఆర్థిక నేరాల విభాగం పోలీసులు అరెస్టు చేశారు. చెన్నైలోని ఆర్థిక సంస్థల మోసం కేసులను విచారణ చేస్తున్న ప్రత్యేక కోర్టులో కేసు విచారణలో ఉంది. కేసు విచారణకు రాగా, ముగ్గురు నిందితులు మాత్రమే ఈ కేసు విచారణకు హాజరౌతున్ననారు. మిగిలిన 10 మంది కనిపించడంలేదని పోలీసులు కోర్టుకు చెప్పారు. కోర్టు విచారణకు హాజరుకాకుండా తప్పించుకుని తిరుగుతున్న. వారిని అరెస్టు చేసి ఫిబ్రవరి 28న కోర్టు ముందు హాజరుపరచాలని కేసు దర్యాప్తు అధికారిని ఆదేశించిన న్యాయమూర్తి నిందితులపై అరెస్టు వారెంట్ జారీ చేశారు.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications