రేప్ను ప్రతిఘటించిన ఆంటీ: ఇద్దరు పిల్లలను కాల్చేసిన కామాంధుడు
రాయపూర్: ఛత్తీస్గడ్ రాష్ట్రంలో ఓ కామాంధుడు అత్యంత దారుణానికి ఒడిగట్టాడు. ఓ మహిళ అత్యాచార యత్నాన్ని అడ్డుకుందనే కోపంతో ఇద్దరు పిల్లలను అతను అగ్నికి ఆహుతి చేశాడు. ఛత్తీస్గడ్లోని దుర్గ్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది.
పోలీసుల కథనం ప్రకారం - ఖాప్రీ గ్రామానికి చెందిన 22 ఏళ్ల మహిళకు నెల రోజుల క్రితం పెళ్లయింది. దీంతో ఆమె గుసిద్ గ్రామంలోని తన ఆడపడుచు ఇంట్లో ఉంటోంది. అదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తి సోమవారంనాడు మధ్యాహ్నం ఇంట్లోకి చొరబడి అత్యాచారానికి ప్రయత్నించాడు.
ఆమె అడ్డుకోవడంతో ఆగ్రహించిన ఆ దుండగుడు ఇంట్లో ఉన్న ఇద్దరు చిన్నారులకు నిప్పంటించాడు. ఈ ఇద్దరు ఆ మహిళ ఆడపడుచు పిల్లలని తెలుస్తోంది. ఈ ఘటనలో చిన్నారులు మోహన్ (3), భువనేశ్వరి (6) అక్కడికక్కడే మరణించారు.
సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడిని మహావీర్గా గుర్తించారు. పిల్లలపై కిరోసిన్ పోసి అతను వారికి నిప్పంటించాడు.