సుప్రీం కోర్టులో రేప్ విక్టిమ్ ఆత్మహత్యాయత్నం
న్యూఢిల్లీ: దేశ అత్యున్నత న్యాయ స్దానం సుప్రీం కోర్టులో ఓ మహిళా న్యాయవాది తనపై అత్యాచారం కేసులో న్యాయం జరగకపోవడంతో విషం తీసుకోని ఆత్మహత్యాయత్నానికి పాల్పడటంతో కోర్టు ఆవరణలో ఉన్నవారంతా అవాక్కయ్యారు.
ప్రధానన్యాయమూర్తి లోధా తన స్దానం నుంచి లేచి వెళ్లబోతుండగా ఆమె ఈ ప్రకటన చేసింది. ఛత్తీస్గఢ్కు చెందిన మహిళా న్యాయవాది తనపై గతంలో సమీప బంధువులే అత్యాచారానికి పాల్పడితే పోలీసులకు ఫిర్యాదు చేసి, ఎఫ్ఐఆర్ నమోదు చేయించినా ఫలితం లేదని వెల్లడించింది.

తన బంధువులపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని, తనకు కేసు విషయంలో న్యాయం జరగలేదని పేర్కొంది. అందుకే తాను విషం తీసుకున్నట్లు చెప్పారు. దీంతో సిబ్బంది వెంటనే ఆమెను హాస్పిటల్కు తరలించారు. ఈ కేసును సుమోటాగా స్వీకరించిన అత్యున్నత న్యాయస్దానం మంగళవారం కేసుపై విచారణ చేపట్టనుంది.












Click it and Unblock the Notifications